Moviesఆ ఆశలు పెట్టుకోకండి రా నాయన.. బిగ్ బాంబ్ పేల్చిన మహేశ్...

ఆ ఆశలు పెట్టుకోకండి రా నాయన.. బిగ్ బాంబ్ పేల్చిన మహేశ్ మూవీ టీం..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా సర్కారి వారి పాట సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హ్యాండ్ సమ్ హీరో త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తన కెరియర్ లో 28వ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నాడు. నిజానికి మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే మూవీ అని… సరదాగా నవ్వుకోవచ్చు అని.. ఫన్నీ ఎలిమెంట్స్ తో సరదా డైలాగ్స్ తో సాగిపోతుందని… వాళ్ళ అభిప్రాయం. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో సినిమా అంటే కచ్చితంగా మరో అతడు సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తారు.


కొందరైతే అతడు సినిమాకి సీక్వెల్ గా SSMB28 సినిమా రాబోతుంది అంటూ పుకార్లు పుట్టించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ ఫ్రెష్ ఫీల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నత్లు తెలుస్తుంది. ఈ మూవీ కొత్త కథ. ఇదివరకు ఎప్పుడు మనం తెరపై చూడని మహేష్ బాబు నటించిన సినిమాగా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మహేష్ బాబు హెల్త్ కండిషన్ కారణంగా కొన్ని రోజులు.. ఆయన ఫారిన్ టూర్స్ కారణంగా మరికొన్ని రోజులు.. రీసెంట్ గా షూటింగ్ సమ్మె కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

అయితే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని.. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ ,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ తల తోఖ లేని వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నుండి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇదే అంటూ అభిమానులు సంబరపడ్డారు.

కానీ రీసెంట్ గా SSMB28 మూవీ టీం అభిమానుల ఆశలను నిరాశపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ గురించి స్పందిస్తూ.. “మహేష్ అభిమానులకి అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి.. ఇది కేవలం తెలుగులోనే తెరకెక్కుతుంది. తెలుగులోనే రిలీజ్ అవుతుంది”.. అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలు లేనే లేవట. ఈ సినిమాకి ఇప్పటికీ పార్ధు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం ఛాంబర్ లో కూడా టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది .

షాకింగ్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ ని మనం డ్యూయల్ రోల్ లో చూడబోతున్నాం. ఈ సినిమాలో సెకండ్ టైం పూజా హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఇంకో హీరోయిన్ గా మహేష్ మరదలిగా కృతి శెట్టిని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది .రీసెంట్ గా స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా సోషల్ మీడియాను షేక్ చేసిన మహేష్ బాబు ఈ సినిమాలో కూడా షర్ట్ లేకుండానే అలరించబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news