Moviesత్రివిక్ర‌మ్ - మ‌హేష్ ఏదో తేడా కొడుతోంది... ప్రాజెక్ట్ క్యాన్సిలే...!

త్రివిక్ర‌మ్ – మ‌హేష్ ఏదో తేడా కొడుతోంది… ప్రాజెక్ట్ క్యాన్సిలే…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న మ‌హేష్ 2019 సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు.. తాజాగా స‌ర్కారు వారిపాట సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా స‌క్సెస్ అయ్యాయి. ఇదే జోష్‌లో మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సినిమా కూడా సెట్స్ మీద‌కు వెళుతోందనే అంద‌రూ అనుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం కూడా ఎప్పుడో అయ్యింది. అయితే ఇంకా షూటింగ్ ఎందుకు స్టార్ట్ కావ‌డం లేద‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాని రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే నటిస్తోంది. జూన్ లేదా జూలై నుంచి సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని అన్నారు. అయితే ఇంకా కథే స‌రిగా సెట్ కాలేద‌ని.. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్‌కు.. మ‌హేష్‌కు మ‌ధ్య ఏవేవో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అయితే వ‌చ్చేశాయ‌ని అంటున్నారు.

త్రివిక్ర‌మ్ చెప్పిన మెయిన్ లైన్‌కు ఫుల్ స్క్రిఫ్ట్ రెడీ అయ్యాక దానికి మ‌ధ్య తేడా ఉంద‌ని మ‌హేష్ చిన్న డౌట్ వ్య‌క్తం చేశాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ పూర్తి క‌థ రెడీ చేశాకే సెట్స్ మీద‌కు వెళ‌దామ‌ని ఖ‌రాఖండీగా చెప్పేయ‌డంతో ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఆ స్క్రిఫ్ట్‌కు తుదిమెరుగులు దిద్దేప‌నిలో బిజీ అయిన‌ట్టు తెలుస్తోంది.

స‌ర్కారు వారి పాట ఫైన‌ల్ రిజ‌ల్ట్‌పై కూడా మ‌హేష్ ఏమంత సంతృప్తిగా లేడ‌ట‌. ఈ సినిమా గురించి ముందుగా ప‌ర‌శురాం చెప్పిన క‌థ‌కు.. ఫైన‌ల్ అవుట్ ఫుట్ తేడా రావ‌డంతోనే సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. చిన్న చిన్న పొర‌పాట్ల‌తోనే స‌ర్కారు వారి పాట అనుకున్న స్థాయికి రాలేద‌న్న అసంతృప్తి మ‌హేష్‌కు ఉంది.

అందుకే త్రివిక్ర‌మ్‌తో 12 ఏళ్ల త‌ర్వాత సినిమా చేస్తున్నాడు. ఆ పొర‌పాట్లు రిపీట్ కాకూడ‌ద‌నే ముందే ప‌క్కాగా క‌థ రెడీ చేసుకున్నాకే సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇక్క‌డే త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ మ‌ధ్య చిన్నా చిత‌కా పంతాలు వ‌చ్చాయంటున్నారు. మ‌రి సినిమా త‌ర్వ‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు అయితే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news