Moviesకియారా పై స్పెషల్ ఇంట్రెస్ట్..మీడియా ముందు పరువు తీసుకున్న కరణ్ జోహార్..!!

కియారా పై స్పెషల్ ఇంట్రెస్ట్..మీడియా ముందు పరువు తీసుకున్న కరణ్ జోహార్..!!

కరోనా ఏ మూహుర్తానా వచ్చిందో..అప్పటి నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి శనిలా పట్టుకుంది. కరోనా లాక్ డౌన్ టైంలో భారీ గా దెబ్బతిన్న బాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇన్నాళ్లు తీసిన సినిమాలన్ని అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పాటు..మిగత భాష సినిమాలు కూడా అక్కడ సూపర్ సక్సెస్ అవ్వడంతో..చాలా మంది సినీ ప్రముఖులు హిందీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం మనం చూశాం. కాగా, భూల్ భూలియా సినిమాతో మళ్లీ బాలీవుడ్ తన పూర్వ వైభవాని తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది.

టబు, కియరా ప్రధాన పాత్రల్లో నటించిన భూల్ భూలియా-2 ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా మరో సినిమా బాలీవుడ్ పై కొత్త ఆశలు పుట్టిస్తుంది. వ‌రుణ్ ధావ‌న్, కియారా అద్వానీ, అనిల్ క‌పూర్, నీతూ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన మూవీ జ‌గ్ జ‌గ్ జీయో. కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ రీసెంట్ గా నే జరిగింది. రిలీజ్ అయిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. భార్య భర్తల మధ్య డివర్స్ కి సంబంధించిన కాన్ సెప్ట్ తో ఫన్నీ గా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

కాగా, ఈ ట్రైలెర్ ఈవెంట్ లో మీడియా తో ముచ్చటించిన జ‌గ్ జ‌గ్ జీయో టీం..ఆసక్తి కర ఆన్సర్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మీడియా కియరా ను తన పెళ్లి గురించి ప్రస్తావించగా..పక్కనే ఉన్న కరణ్ జోహర్ మైక్ తీసుకుని…”ఇక్కడ నేను ఉన్నాను. నా పెళ్లి గురించి ఎవ్వరు పట్టించుకోవడంలేదే. నాకు 50 ఏళ్లు. నేను కూడా ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. నేను పెళ్లికి అర్హుడిని కాదు అని అనుకుంటున్నారా? నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లికి టాలెంట్‌ అవసరం లేదు అవసరం కావాలి” అంటూ కియరా ని వెనకేసుకుని వచ్చాదు. దీంతో కియరా-కరణ్ పై ట్రోల్స్ మొదలైయాయి. ఆమె పెళ్లి గురించి అడిగితే ఈయనకు ఏంటి బాధ..అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు అనవసరం గా నీ పరువు తీసుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news