Moviesబ్లాక్ బస్టర్ ' దేవుళ్ళు ' సినిమా చిన్నారి ఇప్పుడు టాలీవుడ్...

బ్లాక్ బస్టర్ ‘ దేవుళ్ళు ‘ సినిమా చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్… ఎవరో తెలుసా …?

22 సంవత్సరాల క్రితం టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవుళ్ళు అనే భక్తిరస చిత్రం తెరకెక్కింది. నాటి అందాల తార రాశీ, పృథ్వి జంటగా నటించిన ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్నారులు కూడా నటించారు. విడిపోయిన తమ తల్లిదండ్రులను కలిపేందుకు ఆ ఇద్దరు చిన్నారులు పడిన తాపత్రయం.. అటు భక్తి పాటలు… కోడి రామకృష్ణ టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఆ రోజుల్లోనే చాలా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తొలి వారం రోజులు ఈ సినిమా గురించి పట్టించుకున్న వారు లేరు. ఆ తర్వాత క్రమక్రమంగా సినిమా జనాలకు ఎక్కేసింది. తర్వాత నాటి ఆంధ్ర దేశం అంతా దేవుళ్ళ సినిమాకు బ్రహ్మరథం పట్టి సూపర్ హిట్ చేశారు. పృథ్విరాజ్ – రాశి భార్య భర్తలు గా నటిస్తే వాళ్లకు ఇద్దరు పిల్లలుగా బేబీ నిత్య – మాస్టర్ నందన్ నటించారు.

తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించే చిన్నారులుగా నిత్య – నంద‌న్‌ చేసిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ వీరిద్దరూ పాడిన పాట ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలా 22 ఏళ్ళ క్రితం దేవుళ్లు సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నిత్య శెట్టి ఇప్పుడు హీరోయిన్ అయింది. నిత్య హీరోయిన్‌గా పరిచయమైన మొదటి సినిమా పిట్టకథ.

ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా నటన పరంగా మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నిత్య‌ని చూస్తే ఆమె చిన్నప్పుడు దేవుళ్ళులో పోషించిన పాత్రను చూసి అస్సలు గుర్తు పట్టలేరు. మరి పిట్టకథ సినిమా ఫ్లాప్ అయినా నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న నిత్య భవిష్యత్తులో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందేమో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news