Moviesప్రభాస్ క్రేజ్ ని వాడేసుకున్న సజ్జనార్..నువ్వు మామూలోడివి కాదయ్యో..!!

ప్రభాస్ క్రేజ్ ని వాడేసుకున్న సజ్జనార్..నువ్వు మామూలోడివి కాదయ్యో..!!

సోషల్ మీడియాలో ఈ రోజుల్లో మీమ్స్ అనేవి చాలా కామన్ గా మారాయి. మనలో చాల మంది కూడా వర్క్ స్టెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి మీమ్స్ ని చూస్తుంటారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే సరదాగా నవ్వుకోవడానికి మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీమ్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మీమ్స్ లలో ఎక్కువగా నవ్వించడానికే వాడుతారు. రాజకీయాల ప్రమగా కానివ్వండి, సినిమాల పరంగా కానివ్వండి..మరే ఇతర విషయాలనైనా తీసుకుని.. సరదాగా క్రియేట్ చేస్తారు. కాగా, ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ మీమ్స్ వాడుకుంటూ ప్రజలకు ఓ మంచి విషయాని తెలిపారు.

జనరల్ గా ఇప్పుడున్న యువత కొంత మందికి నార్మల్ గా చెప్తే తలకి ఎక్కదు..ఎదైన ఢిఫరెంట్ గా క్రియేతివిటీగా చెప్పాలి..అప్పుడే దాని పై మనసు పెట్టి చూస్తారు..ఆ పని ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ విష్యాని గ్రహించిన సజ్జనార్..సోషల్ మీడియాని వాడుకుంటూ తనదైన స్టైల్ లో ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడమే సేఫ్ అంటూ ఓ ఫన్నీ మీమ్ ని క్రియేట్ చేశాడు. ఆ మీమ్ లో వాళ్లని వీళ్లని వాడటం ఎందుకులే ..ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ‘రాధేశ్యామ్’ హవా నడుస్తుందిగా అనుకుని..ప్రభాస్ పూజా ఫోటోలను వాడుతూ అద్దిరిపోయే టైమింగ్ తో..క్రేజీ రైమింగ్ తో ఓ మీమ్స్ ని క్రియేట్ చేసి ..ట్వీట్ వేశాడు .

మామూలుగా అయితే ఇలాంటీ మ్యాటర్స్ ని పట్టించుకోని జనాలు..అందులో ప్రభాస్ ..ఆయన పక్కన పూజా ఉండడంతో ఓ రేంజ్ ని దీని క్షణాల్లో వైరల్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ రూల్స్‌ను గుర్తుచేయడానికి సినిమా పోస్టర్లు ఉపయోగించి మీమ్స్ చేస్తున్నారు. తాజాగా వీసీ సజ్జనార్ కూడా అలాంటి ఓ ఫన్నీ మీమ్‌ను తయారు చేసి ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినిమాల్లోని సన్నివేశాలను ఆర్టీసీకి అన్వయిస్తూ ఆయన చేసే ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

ఆ మీమ్‌ లో ప్రభాస్ పూజా తో చెప్పుతున్నట్లు “చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా టూర్‌ వెళదామా?’ అని అడగ్గా..అప్పుడు పూజాగ ‘వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం’ అని అంటుంది. దీనికి ప్రభాస్ ఆశ్చర్యంగా ‘ఎందుకు?’ అని ప్రశ్నించగా దానికి పూజా ‘ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం- సుఖమయం’ అని అసలు విషయం చెప్పేస్తుంది పూజా. . దీనికి ‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్‌’ అని ఒక టైటిల్‌ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ మీమ్‌ వైరల్‌గా మారింది. ఇక ఈ మీమ్ చూసిన నెటిజన్స్ సజ్జనార్ ని పొఘిడేస్తున్నారు. హ్యాట్సాఫ్ చెప్పుతూ..నువ్వు సామాన్యుడివి కాదయ్యో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news