Moviesమహేష్ మూవీకి త్రివిక్రమ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..హీరోలు కుడా పనికిరారు..?

మహేష్ మూవీకి త్రివిక్రమ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్..హీరోలు కుడా పనికిరారు..?

ఈరోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఒక్కోక్కరు ఎంతేసి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాట్లాడితే కోట్లు అంటున్నారే కానీ..వేలు,లక్షలు మాటాలు కరువయ్యాయి. పెరుగుతున్న పాన్ ఇండియా మూవీలు..దానికి తగ్గట్లు బడ్జెట్..ఇక లాభాలు ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి లేండి. దీంతో డైరెక్టర్లు,హీరో,హీరోయిన్లు వాళ్ళకు నచ్చిన విధంగా పారితోషకాని పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఆ లిస్ట్ లో చేరిపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

 

నిన్న మొన్నతి వరకు నార్మల్ రెమ్యూనరేషన్ పెట్టుకున్న ఆయన..పవన్ భీంలా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సడెన్ గా తన పారితోషకాని ఢబుల్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భీమ్లా నాయ‌క్ సినిమా విషయంలో ఆయన పాత్ర ఎలా ఉందో మనం చూశాం. డైరెక్టర్ గా తన పేరు స్క్రీన్ మీద లేదు అంతే..కానీ సెట్స్ లో ఆయనే డైరెక్టర్ అని అందరికి అర్ధమైపోయిందట. అంత ఇన్వాల్వ్ మెంట్ పెట్టి పని చేసి..పవన్ కు అద్దిరిపోయే హిట్ ఇచ్చాడు.

భీమ్లా నాయ‌క్ సినిమా కోసం దాదాపు 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంన్న ఈయన ప్రజెంట్ మహేష్ తో చేస్తున్న సినిమాకి ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నారట. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి త్రివిక్ర‌మ్‌కు దాదాపు పాతిక కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా ద‌క్కింద‌ని టాక్‌ అప్పట్లో హాట్ టాపిక్ గా నడించింది. కాగా.. ఇప్పుడు మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాకు గురూజీకి ఏకంగా యాబై కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఒక్కవేళ ఇదే నిజం అయితే రాజమౌళి తరువాత అత్యధిక పారితోషకం తీసుకుంటున్న డైరెక్టర్ ఈయనే.. నాని, రానా లాంటి హీరోలు కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అంటూ త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news