Moviesమ‌హేష్‌, ప‌వ‌న్‌, బ‌న్నీల‌కు క‌లిసొచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మ‌హేష్‌, ప‌వ‌న్‌, బ‌న్నీల‌కు క‌లిసొచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురూ టాలీవుడ్‌లో కొన‌సాగుతున్న టాప్ హీరోలే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ హీరోల‌కు ఒక హీరోయిన్ మాత్రం బాగా క‌లిసొచ్చింది. ఆమె ఎవ‌రో కాదు శ్రుతి హాస‌న్‌. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌, ప‌వ‌న్‌, బ‌న్నీల‌కు ల‌క్కీ హీరోయిన్‌గా శ్రుతి గుర్తింపు పొందింది.

అస‌లేం జ‌రిగిందంటే.. కొమరం పులి, తీన్ మార్, పంజా వంటి వ‌రుస డిజాస్ట‌ర్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకుని స‌త‌మ‌తం అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన `గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందించింది.

అలాగే 1 నేనొక్కడినే, ఆగడు వంటి వ‌రుస ఫ్లాపుల‌ను చ‌విచూసిన మ‌హేష్ బాబు.. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన `శ్రీమంతుడు ` సినిమాతో మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2015లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. ఇద్దరమ్మాయిలతో బిగ్ ఫ్లాప్‌ను అందుకున్న ఈయ‌న ఆ త‌ర్వాత శ్రుతి హాస‌న్‌తో `రేసుగుర్రం` చిత్రం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా వంటి నాలుగు ఫ్లాప్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ `క్రాక్‌` సినిమాతో భారీ విజ‌యం సాధించాడు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలోనూ శ్రుతి హాస‌న్‌నే హీరోయిన్‌గా న‌టించింది. మొత్తానికి ఫ్లాపుల్లో కూరుకుపోయిన హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్‌గా శ్రుతి పేరు తెచ్చుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news