Moviesఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్..ఇన్నాళ్లు పట్టిందా పాప నీకు..?

ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్..ఇన్నాళ్లు పట్టిందా పాప నీకు..?

నేటి కాలంలో అందరు యూట్యూబ్ ఛానెల్ పెట్టి తమకు తోచిన విధంగా వీడియోలు తీస్తూ..పోస్ట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ద్వారనే కోట్లు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు అనడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఇలాంటి లిస్ట్ లో బడా బడా సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక్ ఆ లిస్ట్ లోకి చేరిపోయింది అందాల తార మహానటి కీర్తి సురేష్. అమ్మడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పద్దతికి మరో రూపం..అమాయకత్వానికి సిస్టర్ లా..ఉంటుంది అంటారు ఆమె అభిమానులు.

ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉంది. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. మహేష్ బాబు పక్కన సర్కారు వారి పాట సినిమా చేస్తున్న కీర్తి సురేష్..చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చెల్లిలుగా నటించడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే మహమారి కరోనా బారిన పడిన ఈ బ్యూటీ ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉంటూ..ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఇక షూటింగ్ లల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అమ్మడు అభిమానులతో టైం దొరికిన్నప్పుడల్లా సమయం గడుపుతుంది.

సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక రీసెంట్ గా అభిమానులకు మరింత చేరువ అవ్వడానికి తన గురించిన అప్ డేట్స్ తెలుసుకోవడానికి కీర్తి సురేష్ ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈరోజు నా అధికారిక యూట్యూబ్ ఛానల్‏ను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్ స్కైబ్ చేసి వీడియోలు చూడండి అంటూ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది కీర్తి సురేష్.

సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్​ ఫొటోస్​తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా తన షార్ట్​ వీడియోస్​, ఫిట్​నెస్​ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు సంతోషపడుతూనే ..ఇన్నాళు పట్టిందా ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి..ఎప్పుడొ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాల్సింది నువ్వు అంటూ కామెంట్స్పెడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news