Moviesకేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన తార‌క్‌

కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన తార‌క్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ రెండు నెలల పాటు ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్నారు. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే జనతాగ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. దీంతో మరో సారి వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ కెరీర్లో 30వ ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 29, 2022న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ కూడా రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుంది.

కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి తాజాగా మీడియాతో ఆస‌క్తి క‌రమైన విషయాలు తార‌క్‌ షేర్ చేసుకున్నారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది అని చెప్పారు. కేజీఎఫ్ స్టైల్లోనే అదిరిపోయే యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుంద‌న్న చెప్పాడు. ఈ మాట‌తో ఎన్టీఆర్ అభిమానుల్లో అప్పుడే స‌రికొత్త ఉత్సాహం వ‌చ్చేసింది.

కే జి ఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో స‌లార్ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్‌ సినిమా ఉంటుంది. రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news