Moviesవారసుడొస్తున్నాడోచ్..అమితాబ్ ఇంట సంబరాలు షురూ..?

వారసుడొస్తున్నాడోచ్..అమితాబ్ ఇంట సంబరాలు షురూ..?

ఐశ్వ‌ర్య‌రాయ్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతొ అందంతో ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది ఈ చిన్నది. ఈమె నటనకు డ్యాన్స్ కు ఎన్ని అవార్డులైనా ఆమె నటన ముందు చిన్నబోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు. స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు నటించి..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్.. 2007 ఏప్రిల్‌ 20న .. అభిషేక్‌ బచ్చన్‌ని వివాహం చేసుకొని బ‌చ్చ‌న్ కోడ‌లిగా వెళ్లింది. 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.

నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా త‌న వంతు బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఈ నీలి కళ్ల సుందరి వ‌న్నె మాత్రం త‌గ్గడం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐశ్వ‌ర్య‌రాయ్ రెండోసారి గ‌ర్భ‌వ‌తి అయ్యింది అంటూ ప్ర‌చారం జరుగుతుంది. గ‌త కొద్ది రోజులుగా ఐశ్వ‌ర్య‌రాయ్ గ‌ర్భ‌వ‌తి అంటూ ప్ర‌చారం న‌డుస్తోన్న క్రమంలో ..తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్‌, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది.

టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. ఆ సమయంలో రిపోర్టర్స్ వారి ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూతురిని దగ్గరకి లాక్కుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఐష్ గ‌ర్భ‌వ‌తి అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news