Moviesకాలేజ్ రోజుల్లో అల్లు అర‌వింద్ చిలిపి చేష్ట‌లు ఇలా ఉండేవా..?

కాలేజ్ రోజుల్లో అల్లు అర‌వింద్ చిలిపి చేష్ట‌లు ఇలా ఉండేవా..?

టాలీవుడ్లోని సక్సెస్ ఫుల్ నిర్మాతలలో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాల్లో తెరకెక్కించారు. టాలీవుడ్ లో దివంగత సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్ కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆహా పేరుతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన అరవింద్ అదిరిపోయే స్ట్రాటజీ తో దూసుకుపోతున్నాడు.

పూర్తి తెలుగు కంటెంట్ తో వచ్చిన తొలి ఓటీటీగా ఆహా రికార్డులకు ఎక్కింది. ఇక అర‌వింద్ కాలేజీ రోజుల్లో చాలా అల్లరి చేశారట. ఈ విషయాన్ని సీనియర్ డైరెక్టర్ సాగ‌ర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ – దర్శకుడు రవిరాజా పినిశెట్టి – సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ ముగ్గురు తనకు సీనియర్స్ అని… తాను ఎనిమిదో తరగతి చదివే సమయంలో వాళ్ళు పదో తరగతి చదివే వారి సాగర్ గుర్తు చేసుకున్నారు.

వీళ్ళతో తనకు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే పరిచయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అర‌వింద్‌కు చదువు తక్కువ అయినా.. తెలివి ఎక్కువ ఉందని సాగర్ తెలిపారు. అప్పట్లో కాలేజ్ లో మహిళా స్టూడెంట్స్ కోసం స్పెషల్ బస్సులు వేశారట. ఆ బస్సులో కేవలం అమ్మాయిలు మాత్రమే ఎక్కాల‌ట‌. అయితే అల్లు అరవింద్ బస్సు కండక్టర్ ను… డ్రైవర్ను దింపేసి ఆ బస్సును తోలుకు వెళ్లే వాడ‌ని సాగర్ చెప్పారు.

కాలేజీ రోజుల్లోనే హీరోయిజం ఫీల్ అయ్యి అరవింద్ అలా చేశాడని సాగర్ నాటి సంఘటన గుర్తు చేసుకున్నారు. తాను డైరెక్టర్ అయ్యాక బాలచందర్ హీరోగా తెరకెక్కిన పబ్లిక్ రౌడీ అనే సినిమాలో ఈ సంఘ‌ట‌న బేస్ చేసుకుని ఓ సీన్ పెట్టాన‌ని సాగర్ పేర్కొన్నారు. ఏదేమైనా సాగర్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే కాలేజ్ రోజుల్లో అల్లు అర‌వింద్ చాలా చిలిపి పనులు చేసినట్లు అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news