Moviesవాళ్లకు సారీ చెప్పిన RX100 డైరెక్టర్‌.. అభిమానులు షాక్ ..అసలు ఏమైందంటే..

వాళ్లకు సారీ చెప్పిన RX100 డైరెక్టర్‌.. అభిమానులు షాక్ ..అసలు ఏమైందంటే..

అజయ్‌ భూపతి..ఈ పేరుకు స్పెషల్ ఇంట్ర డక్షన్ అవసరం లేదు. తాను అంటే ఏమిటో ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాడు. యస్.. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో కలిసి..తెర పై హాట్ రొమాన్స్ పండించి చివర్లో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చి..ప్రేక్షకుల కళ్లలో నీలు తెప్పించిన డైరెక్టర్ ఇతనే.

కాగా.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న..ఈయన రెండొ సినిమా వస్తుందంటే..ఫస్ట్ సినిమా కన్నా ఎక్కువ కంటేంత్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. అయితే, అజయ్ భూపతి ఇటివల తెరకెక్కించిన రెండో సినిమా “మహా సముద్రం” రిలిజైన విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌, శర్వానంద్‌ వంటి బడా హీరోలతో పాటు పలువురు సీనియర్‌ నటులతో తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బలం లేని కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఈ విషయనే డైరెక్టర్ అజయ్ భూపతిని ఓ నెటిజన్ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘మహా సముద్రం సినిమాను ఏంటి అన్న అలా తీశావు. చాలా ఊహించుకున్నాం’ అని అడిగిన అభిమానికి..దర్శకుడు అజయ్‌ భూపతి ఎలాంటి భేషజాలకు పోకుండా.. జెన్యూన్‌గా .. ‘మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. మరోసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తా’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో అంత పెద్ద డైరెక్టర్ ఓ నెటిజన్ అడిగిన దానికి డైరెక్ట్ గా సారీ చెప్పడం ఏంటి..అని షాక్ అవుతున్నారు.

Sorry for not reaching your expectations… Next time I will be back with a story that can satisfy you all… https://t.co/RTWin30gKV

— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news