Moviesఆ ఒక్క మాటతో ఇద్దరు బడా డైరెక్టర్స్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన...

ఆ ఒక్క మాటతో ఇద్దరు బడా డైరెక్టర్స్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్టీఆర్..?

బాలీవుడ్ మెగా‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహారిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో.. దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేసారు. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ షో జెమినీ లో ప్రసారం అవుతుంది.

అయితే, ఇప్పుడు ఈసారి హోస్ట్ గా ఐదో సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసి బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈసారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ ఢబుల్ జోష్ తో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాప్ సెలబ్రిటీలతో కూడా గేమ షో చేస్తూ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ షో కి సంబధించి ప్రోమో రిలీజ్ చేసారు జెమిని టీవి బృందం.

ప్రమో ఆధారంగా.. ఎన్టీఆర్ దిగ్గజ దర్శకులైన ఎస్.ఎస్ రాజమౌళి, కొరటాల శివను గేమ్ షోకు వచ్చారు. ఎన్టీఆర్.. రాజమౌళి, కొరటాలను వేదికపై ఆహ్వానించగా.. వారిద్దరూ సీటులో కూర్చొగానే.. రోల్ కెమెరా.. యాక్షన్ అంటారు. అంతే.. వెంటనే షాకైన ఎన్టీఆర్.. ఆగండి అంటూ.. ఈ లొకేషన్ నాది.. ఇక్కడ నేనే బాస్ అంటూ పంచ్ డైలాగులు పేల్చారు. అంతే దెబ్బకు ఇద్దరు డైర్క్టర్స్ గప్ చుప్ అయిపోయారు. ఇప్పుడీ ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ సెప్టంబర్ 20న తెలికాస్ట్ కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news