Gossipsవామ్మో ఈ ఆంటీకి క్రేజ్ ఎక్కువే..బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ అత్తగారు..!!

వామ్మో ఈ ఆంటీకి క్రేజ్ ఎక్కువే..బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ అత్తగారు..!!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మామిళ్ల శైల‌జా ప్రియ బుల్లితెర మీద న‌టిగా ఎన్నో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్లు వేసి మెప్పించింది. శైల‌జ‌కు తిరుగులేని అంద చందాల‌తో పాటు అద్భుత‌మైన అభిన‌యం కూడా ఉంది. దీంతో ఆమెకు సినిమాల్లో కూడా మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. జై సింహా సినిమాలో బ్ర‌హ్మానందం ఆమెను బాల‌య్య‌తో లింక్ ఉంద‌ని ఎప్పుడూ అనుమానించే మొగుడుగా న‌టించ‌గా… ఈ జంట ఎంత కామెడీ పండించిందో చూశాం.

ఇక శైల‌జ‌కు సోష‌ల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు తెలుగింటి ఆడపడుచులా , తనదైన శైలిలో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫేస్ బుక్ పేజీలో ఏకంగా 5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె 2002లో కిషోర్ అనే వ్య‌క్తిని పెళ్లాడింది. ఈ దంప‌తుల‌కు ఓ బాబు ఉన్నాడు.

వీరు ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆమె న‌ట‌న‌కు బుల్లితెర మీద అనేక అవార్డులు దాసోహం అయ్యాయి. శైల‌జ‌ 1998లో మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమా లో మొట్టమొదటిసారిగా నటించింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఆమె 80 సినిమాల్లో న‌టించింది. ఇంత‌కు ఇంత అంద చందాల‌తో అంద‌రిని ఎట్రాక్ట్ చేసే ఈ శైలజా ఆంటీ వ‌య‌స్సు 43 సంవ‌త్స‌రాలు..!

శైలజా ప్రియ.. సీరియల్‌ ద్వారా ఇండస్ట్రీకి నటిగా పరిచయం అయినప్పటికీ క్రమక్రమంగా చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంది. ఈ మధ్య పలు చిత్రాలు, సీరియళ్లలో నటిస్తూ బాగానే రాణిస్తోంది. కాగా ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “మిర్చి” చిత్రంలో హీరోయిన్‌ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే తాజాగా నటి శైలజా ప్రియ గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడికి బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షో పాల్గోనబోతున్నట్లు టాక్. అంతేకాదు .. ఇందులో భాగంగా శైలజా ప్రియా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ కూడా డిమాండ్‌ చేస్తోందట.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news