Moviesశేఖర్ మాస్టర్ "ఢీ" షో నుండి వెళ్లిపోయింది అందుకే.. జబర్ధస్త్ కమెడియన్...

శేఖర్ మాస్టర్ “ఢీ” షో నుండి వెళ్లిపోయింది అందుకే.. జబర్ధస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!!

ఇప్పుడు శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఓ స్టార్. డ్యాన్సుల్లో శేఖర్ మాస్టర్ స్టైలే వేరు. టాప్ హీరోలందరికీ స్పెషల్ ఐకాన్ స్టెప్పులను క్రియేట్ చేసే శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అంటే ఒకప్పుడు కేవలం కొరియోగ్రఫర్‌గానే చూసేవారు. కానీ ఇప్పుడు పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారు.

మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకూ ఎవరి సాంగ్ అయినా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారంటే.. అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలా శేఖర్ మాస్టర్ తన సత్తాను బుల్లితెర, వెండితెరపై చాటుతున్నారు. అయితే కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఈటీవీ నుంచి స్టార్ మాకు మారిపోయనట్టు కనిపిస్తోంది. ఢీ షోలో జడ్జ్‌గా కనిపించక పోవడం. అదే సమయంలో శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్ షో లో జడ్జ్‌గా గా కనిపించడంతో జనాలు అందరూ కూడా గుసగుసలు ఆడటం మొదలుపెట్టేశారు. ఢీ నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకున్నాడని, మల్లెమాలతో గొడవలు జరిగి ఉంటాయని అందుకే వెళ్లిపోయారని టాక్. అయితే దీని పై తాజాగా జబర్ధస్త్ కమెడియన్ మహీధర్ స్పందించారు. శేఖర్ మాస్టర్ ని ఢీ షో నుండి ఎవరు తప్పించలేదని.. మాస్టర్ ప్రస్తుతం కమెడి స్టార్స్ షో చేస్తున్నారని..అందువల్లే శేఖర్ మాస్టర్ ఢీ షో నుండి తప్పుకున్నాడాని తెలిపాడు.

నిజం చెప్పాలంటే.. శేఖర్‌ మాస్టర్‌ ఢీ షో నుంచే ఎదిగారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ షో నుంచి డాన్స్ మాస్టర్‌గా, కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, బన్నీ, పవన్‌, ఇలా అందరు స్టార్‌ హీరోలతో పనిచేయడానికి పునాది పడిందే శేఖర్‌ మాస్టర్ కి ఢీలోనే అని చెప్పొచ్చు. ఢీ నుంచి ఎదిగిన ఆయన ఆ తర్వాత ఆ షోలోనే జడ్జ్ గా వ్యవహరించడం విశేషం. ఇప్పుడు శేఖర్ మాస్టర్ స్టార్ మా లో కామెడీ స్టార్స్ షో లో నటి శ్రీదేవితో కలిసి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news