Gossipsనార‌ప్ప‌, దృశ్యం 2 ఓటీటీ రిలీజ‌... ఎన్ని కోట్ల‌కు అమ్మారో తెలుసా..!

నార‌ప్ప‌, దృశ్యం 2 ఓటీటీ రిలీజ‌… ఎన్ని కోట్ల‌కు అమ్మారో తెలుసా..!

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తోన్న నార‌ప్ప‌, దృశ్యం 2 రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెర‌చుకునే ప‌రిస్థితి లేదు. థియేట‌ర్లు తెర‌చుకున్నా 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ ఉండ‌దు.. జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. పైగా ఈ రెండూ రీమేక్ సినిమాలే. దీంతో నిర్మాత సురేష్‌బాబు అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేస్తూ వ‌డ్డీ డ‌బ్బులు లాస్ అని.. ఓటీటీకి అమ్మేసిన్టు తెలుస్తోంది. రెండు సినిమాలను కలిపి రు. 70 కోట్ల మేరకు అమ్మేశారని తెలుస్తోంది.

ఒక‌టి హాట్ స్టార్‌కు, మ‌రొక‌టి అమోజాన్ ప్రైమ్‌కు అమ్మిన‌ట్టు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ? ఇక రానా విరాట‌ప‌ర్వం సినిమాను సైతం ఓటీటీకి ఇచ్చేందుకు బేర‌సారాలు న‌డుస్తున్నాయ‌ట‌. ఏదేమైనా బిజినెస్ లెక్క‌ల్లో ఎప్పుడూ ప‌క్కాగా ఉండే సురేష్‌బాబు ఓటీటీకి అమ్మేసినా కూడా సినిమాల‌కు మంచి లాభాలు తీసుకు వ‌స్తోన్న ప‌రిస్థితి. ఇక ఈ యేడాది సురేష్ బ్యాన‌ర్ నుంచి థియేట‌ర్ రిలీజ్‌లు లేన‌ట్టే ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news