Moviesపాపం.. ముదురు హీరోయిన్ ప్రియ‌మ‌ణి పై ప‌గ‌బ‌ట్టింది ఎవ‌రు...!

పాపం.. ముదురు హీరోయిన్ ప్రియ‌మ‌ణి పై ప‌గ‌బ‌ట్టింది ఎవ‌రు…!

ప్రియ‌మ‌ణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆమె బాల‌య్య‌, ఎన్టీఆర్‌, గోపీచంద్‌, జ‌గ‌ప‌తిబాబు, నితిన్ లాంటి హీరోల సినిమాల్ల న‌టించింది. అప్పుడెప్పుడో ప‌దిహేడేళ్ల క్రితం వ‌చ్చిన ఎవ‌రే అత‌గాడు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ప్రియ‌మ‌ణి కుర్ర హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కు అంద‌రితోనూ న‌టించింది. ఎంచ‌క్కా పెళ్లి చేసుకుని బెంగ‌ళూరులో సెటిల్ అయ్యి కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ అమ్మ‌డు ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది.

 

సెకండ్ ఇన్సింగ్స్‌లో తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అస‌లే సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. వాళ్ల ప‌క్క‌న న‌టించేందుకు ఎవ్వ‌రు ముందుకు రావ‌డం లేదు. ఇప్పుడు ప్రియ‌మ‌ణి సెకండ్ ఇన్సింగ్స్ అయితే బాగానే స్టార్ట్ అయ్యింది. ఆమె చేస్తోన్న రెండు సినిమాలు మంచివే. రెండు ద‌గ్గుబాటి హీరోల‌వే కాగా.. రెండిటికి సురేష్‌బాబు నిర్మాత‌. వెంకీతో నార‌ప్ప‌, విరాటపర్వం సినిమాలో రానా ప‌క్క‌న చేస్తోంది. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్‌.

 

అయితే ప‌రిస్థితులు స‌క్ర‌మంగా ఉండి ఉంటే ఆమెకు సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న మంచి ఛాన్సులే వ‌చ్చి ఉండేవి. అయితే క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్పుడు సినిమాలు లేక‌పోవ‌డంతో ఆమెకు అవ‌కాశాలు రాలేదు కాని.. షూటింగ్‌లు స్టార్ట్ అయితే ఆమెకు వ‌రుస‌గా మంచి ఆఫ‌ర్లే వ‌చ్చేవి. ఏదేమైనా క‌రోనా ప్రియ‌మ‌ణి సెకండ్ ఇన్సింగ్ చాన్సుల‌పై గ‌ట్టి దెబ్బేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news