Politicsతెలంగాణ‌లో దారుణం... భార్య‌ను న‌మ్మించి చంపేశాడు

తెలంగాణ‌లో దారుణం… భార్య‌ను న‌మ్మించి చంపేశాడు

ఏడు జ‌న్మ‌లు క‌లిసుంటాన‌ని ప్ర‌మాణం చేసి భార్య మొడ‌లో తాళి కట్టిన భ‌ర్తే ఆమె పాలిట య‌ముడు అయ్యాడు. భార్య‌ను దారుణంగా క‌డ‌తేర్చాడు. ఈ విషాద సంఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గాంధీనగర్లో చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం శూలానగర్ గ్రామానికి చెందిన గడ్డికొప్పుల జనార్ధన్‌కు ఐదేళ్ క్రితం సార‌పాక గాంధీన‌గ‌ర్‌కు చెందిన ఆనంద‌రావు కుమార్తె అనూష‌తో పెళ్ల‌య్యింది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు లేఖ‌న‌ప్రియ‌, హ‌ర్షిత ఉన్నారు.

భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా విబేధాలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితం మ‌రోసారి గొడ‌వ జ‌ర‌గ‌డంతో భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అనూష‌ తల్లిదండ్రులు అల్లుడు జనార్ధన్ కు ఫోన్ చేసి నీ పద్ధతి బాగాలేదు.. మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చి ఇంటికి వ‌చ్చి భార్య‌ను తీస‌కు వెళ్లాల‌ని చెప్పారు. తన అత్తగారిల్లు గాంధీనగర్ కు వచ్చిన అల్లుడు జ‌నార్థ‌న్‌ను అత్తమామలు మందలించారు.

 

అత్త‌మామ‌లు బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇదే అద‌నుగా భావించిన జ‌నార్థ‌న్ ఇంట్లో టీవీ చూస్తోన్న భార్య‌పై క‌త్తితో దాడి చేశాడు. ఆమె కేక‌లు విన్న స్థానికులు అక్కడకు పరుగులు పెట్టే లోగానే భర్త పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జనార్ధన్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news