Newsవీడు మ‌హా కేటుగాడు.. వైసీపీ లేడీ ఎమ్మెల్సీకే టోక‌రా ప్లాన్

వీడు మ‌హా కేటుగాడు.. వైసీపీ లేడీ ఎమ్మెల్సీకే టోక‌రా ప్లాన్

ఓ మోస‌గాడు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీకే టోక‌రా వేయ‌బోయాడు. అయితే ఆమెకు అనుమానం రావ‌డంతో అస‌లు క‌థ అడ్డం తిరిగింది. క‌డ‌ప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జ‌కియా ఖాన‌మ్‌కు ఓ అజ్ఞాత వ్య‌క్తి ఫోన్ చేశాడు. తన పేరు బాబు జగ్జీవన్‌రావ్‌ అని, సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అత‌డు మాట్లాడుతూ రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే మీకు ప్రభుత్వం రూ.25 లక్షల రుణమిస్తుందని చెప్పాడు.

రాయ‌చోటిలో ఉన్న ఆమెకు స‌ద‌రు అజ్ఞాత టోక‌రా వ్య‌క్తి డబ్బును జమ చేసేందుకని తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను పంపించాడు. దీన్ని ఆమె వెంటనే ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఆరా తీశారు. అక్కడ అలాంటి వారెవరూ లేరనే విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్‌ సీఐని ఆదేశించారు. మొత్తానికి ఎమ్మెల్సీకే టోక‌రా వేసేందుకు ప్ర‌య‌త్నించిన అత‌డి కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news