Gossipsమళ్ళి మొదటిదే కావాలంటున్న అఖిల్..!

మళ్ళి మొదటిదే కావాలంటున్న అఖిల్..!

వరుస పరాజయాల తర్వాత అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పైన ఫోకస్ చేశాడు. ఎప్పుడో వ‌చ్చిన బొమ్మ‌రిల్లు సినిమా త‌ర్వాత హిట్ లేని భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం రెండు నెల‌లుగా యూనిట్ వెతుకులాట‌లోనే ఉంది. ముందుగా పూజ హెగ్డే, కైరా అద్వానీ పేర్లు వినిపించాయ్‌. వారు బిజీగా ఉండ‌డంతో క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న కోసం గ‌ట్టిగా ట్రై చేశారు.

చివ‌ర‌కు ర‌ష్మిక ఒప్పుకోదేమోన‌ని ఆమెకు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశారు. ఆమె ముందు ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలే లైన్లో ఉన్నాయి. దీంతో రష్మిక కూడా ఈ సినిమా చేయలేనని చెప్పేయడంతో ఎవరినీ తీసుకోవాలా అని చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడింది. ఫిల్మ్‌న‌గ‌ర్ లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం త‌న తొలి సినిమా హీరోయిన్ స‌యేషా సైగ‌ల్‌ను అఖిల్ సూచ‌న మేర‌కు సంప్ర‌దించ‌నున్న‌ట్టు టాక్‌.

తెలుగులో అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఆమె ఆ త‌ర్వాత కోలీవుడ్‌లో వ‌రుస‌గా హిట్లు అందుకుంది. ఈ క్ర‌మంలోనే త‌మిళ్ హీరో ఆర్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు స‌యేషాకు పెళ్లి అయినా మంచి క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెతో మ‌రోసారి త‌న కాంబినేష‌న్ రిపీట్ చేసి హిట్ కొట్టాల‌ని అఖిల్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే ఇప్పుడు త‌న‌కు హీరోయిన్ దొర‌క‌ని ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ఆమెనే తీసుకోవాల‌ని రిక‌మెండ్ చేస్తున్నాడ‌ట‌. అది సంగ‌తి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news