Gossipsనాగ్ చాలు అఖిల్ వద్దంటూ అక్కనేని ఫ్యాన్స్ ఆగ్రహం

నాగ్ చాలు అఖిల్ వద్దంటూ అక్కనేని ఫ్యాన్స్ ఆగ్రహం

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఆయన ట్వీట్స్ మీద పెట్టే ఆసక్తి ఏదో సినిమా మేకింగ్ మీద పెడితే బాగుంటుంది అన్న వాదన వినిపిస్తుంది. లేటెస్ట్ గా పాతికేళ్ల తర్వాత నాగార్జునతో ఆఫీసర్ సినిమా తీసిన వర్మ అదే పాత పంథాలో కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేకుండా చేశాడు. ఇక ఈ సినిమా నాగార్జున కెరియర్ లో భారీ డిజాస్టర్ల సరసన నిలిచింది.

ఈ సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ బుద్ది చెప్పారంటూ వర్మ పోస్టర్ మీద పాలాభిషేకం చేశారు. అంతేకాదు అఖిల్ సినిమా క్యాన్సిల్ అయినందుకు సంతోషంగా కూడా ఉన్నారు. అక్కినేని ఫ్యాన్స్ వర్మకు పాలాభిషేకం చేసింది ఓ చిన్నపాటి వార్నింగ్ లానే అంటున్నారు. అభిషేకం చేసినా ఇక మమ్మల్ని వదిలిపెట్టు అన్న విధంగా ఈ కార్యక్రమం జరిగింది.

మొత్తానికి మెగా ఫ్యాన్స్ నుండే కాదు వర్మకు అక్కినేని ఫ్యాన్స్ నుండి కూడా పెద్ద షాక్ తగిలింది. సినిమా బాగా లేకుంటే ఎక్కడో తన్నమన్నాడని నాగ్ ఓ ఈవెంట్ లో చెప్పాడు. మరి నాగార్జున ఆ పని ఎప్పుడు చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news