Movies8 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశారు...ఈ సారి ఏమి చేస్తారో....?

8 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశారు…ఈ సారి ఏమి చేస్తారో….?

సౌతిండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనూ లెజెండ్స్‌గా గుర్తింపు వున్న నటులు కమల్ హాసన్, మోహన్ లాల్. ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. చివరిసారిగా 2009లో వీళ్లిద్దరూ కలిసి ‘ఉన్నైపోల్ ఓరువన్’ అనే తమిళ చిత్రంలో నటించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన ఏ వెడ్నెస్‌డే సినిమాకు ఇది తమిళ రీమేక్. ఉన్నైపోల్ ఓరువన్ సినిమా రిలీజైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి మరో తమిళ రీమేక్ సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. ఇది కూడా బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాకు తమిళ రీమేక్ వెర్షన్.

బాలీవుడ్ హిట్ ఫిలిం ఓ మై గాడ్ సినిమాకి సంబంధించిన తమిళ రీమేక్ వెర్షన్‌లో మోహన్ లాల్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలని ఈ నటులు కానీ లేదా తమిళ సినీవర్గాలు కానీ ఎవ్వరూ అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అన్నట్టు ఇదే ఓ మై గాడ్ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల అనే టైటిల్‌తో రూపొంది, హిట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news