టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవికి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాడు. దానికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. కాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా పక్క భాష ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందించారు .
పలువులు రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. కాగా ఈ వేడుకకు చిరంజీవి సతీమణీ సురేఖతోపాటు కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన కూడా హాజరవ్వడం హైలైట్ గా మారింది . అంతేకాదు చిరంజీవితో పాటు మరో అయిదుగురు కూడా పద్మ విభూషణ్ 17 మందికి పద్మభూషణ్ 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈ సందర్భంలోనే చిరంజీవి పద్మ విభీషణ్ అందుకుంటున్న మూమెంట్లో రామ్ చరణ్ – ఉపాసనలు చేసిన పని ఇప్పుడు హైలైట్ గా మారింది .
రాష్ట్రపతి ద్రౌపతి మర్ము చేతులమీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నప్పుడు రామ్ చరణ్ అదే విధంగా ఉపాసన చాలా చాలా ఎమోషనల్ అయ్యారు . ఆ విషయం వాళ్ల కల్లలో బాగా క్లియర్ గా తెలుస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో తండ్రికి పద్మవిభూషణ్ రావడం పట్ల చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని మెగాకోడలు ఉపాసన కూడా ఆ ఇంటికి కోడలు కాదు కూతురులా ఉంది అని దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా పద్మవిభూషణ్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి pic.twitter.com/M8Kt0znFbI
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024