Gossipsఅందుకే 'సైరా' లోగో లాంచ్ కు చిరంజీవి రాలేదా..!

అందుకే ‘సైరా’ లోగో లాంచ్ కు చిరంజీవి రాలేదా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి లోగో లాంచ్ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. నిన్న జరిగిన ఈ ఈవెంట్ కు రాజమౌళి, అల్లు అరవింద్, రాం చరణ్ లతో పాటుగా వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు వేడుకలో పాల్గొన్నారు. కాని బర్త్ డే బోయ్ మెగాస్టార్ మాత్రం అటెండ్ కాలేదు.

అయితే చిరు అటెండ్ కాకపోడానికి ఓ సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ బర్త్ డే పార్టీకి కూడా పెద్ద హంగామా చేశారు. అప్పుడు కూడా చిరు తప్ప మిగతా వారంగా వచ్చారు. అఫ్కోర్స్ పవన్ ఎలాగు ఇలాంటి వాటికి రాడనుకోండి. చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150 ఎనౌన్స్ చేశాక జరిగిన మొదటి ఫంక్షన్ అది.. అయినా సరే చిరు దానికి అటెండ్ కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఖైది నంబర్ 150 సంచలన విజయం అందుకుంది.

ఇప్పుడు అదే సెంటిమెంట్ తో చిరు ఈసారి సైరా నరసింహారెడ్డి ముందు జరుగుతున్న ఈ వేడుకలకు తను అటెండ్ కాలేదట. ఏది ఎలా ఉన్నా సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మెగా ఫ్యాన్స్ కు అంతకుమించిన ఆనందం ఇంకోటి ఉండదు. సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ తోనే గర్జించిన మెగాస్టార్ సినిమాను ఏ రేంజ్ లో తీయబోతున్నారో రుచి చూపించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news