Newsడ్రగ్స్ రాకెట్ పై సమంత.. నాకెందుకు ఈ రచ్చ అనుకుంది అందుకే..!

డ్రగ్స్ రాకెట్ పై సమంత.. నాకెందుకు ఈ రచ్చ అనుకుంది అందుకే..!

టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ రాకెట్ పై స్టార్స్ తో కూడా సంబంధాలున్నయన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పూరి, శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ ఇలా ఒక్కొక్కరిని లైన్ గా విచారణ చేస్తున్న ఎక్సైజ్ పోలీసులు వారు ఇచ్చిన వివరాలన్ని బయటకు లీక్ చేయట్లేదు. అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ విషయంపై సినిమా వాళ్లు కూడా మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు.

సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ సమంత అయితే డ్రగ్స్ కుంభకోణపై నో కామెంట్ అనేసింది. నిన్న వరంగల్ హన్మకొండలోని బిగ్ సి షోరూం మొదలు పెట్టడానికి వచ్చిన సమంత నాగ చైతన్యతో తన పెళ్లి విషయాలను చెప్పింది. అక్టోబర్ 6,7 తారీఖులలో గోవా లో చాలా సింపుల్ గా చైతుతో తన పెళ్లి జరుగబోతుందని చెప్పింది సమంత.

ఇక టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మీ స్పందన ఏంటని అడుగగా.. ప్రస్తుతం ఆ విషయం పట్ల మాట్లాడటం ఇష్టం లేని సమంత నో కామెంట్ అని సైలెంట్ అయ్యింది. డ్రగ్స్ రాకెట్ లో బడా బాబుల ఇన్వాల్వ్ మెంట్ ఉందని సమంత కూడా అనుకుందో ఏమో కాని ఈ రచ్చ నాకెందుకు అనుకుని జస్ట్ సింపుల్ గా నో కామెంట్ అని అక్కడితో ఆ టాపిక్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక సమంత వస్తుందని తెలియడంతో హన్మకొండ బిగ్ సి ప్రాంతమంతా ప్రేక్షకులతో సందడి వాతావరణం ఏర్పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news