Newsనాగార్జున పొలంలో తీవ్ర విషాదం.. కనీరుమున్నిరు అయిన కుటుంబం..!

నాగార్జున పొలంలో తీవ్ర విషాదం.. కనీరుమున్నిరు అయిన కుటుంబం..!

తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ (32) అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ చూసేందుకు వెళ్లాడు వెంకటరాజు అయితే మెయిన్ లైన్ తెగి ఉండటం గమనించని వెంకటరాజు అది కాలికి తగిలి కరెక్ట్ షాక్ తిన్నాడు.. అతన్ని కాపాడే క్రమంలో దుర్గ కూడా అతన్ని పట్టుకుంది.

ఇద్దరు అక్కడకిక్కడే మృతి చెందారు. తెగి పడిన విద్యుత్ వైరుని గమనించపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మరణంలోనూ ఈ ఇద్దరు కలిసి ఉండటం విశేషం. నాగార్జునకు ఈమధ్య స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మనం సెట్ కాలిపోయింది. అది పెద్ద లాసే తీసుకురాగా ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఇలా ఇద్దరు మృతి చెందడం షాకింగ్ గా మారింది. అయితే జరిగిన సంఘటన మీద నాగార్జున వివరాలు తెలుసుకుంటున్నాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news