ఇప్పుడు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది అనే బాధకు సంబంధించిన మీమ్స్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా పది మ్యాచ్ లు ఓడిపోకుండా గెలిచిన ఇండియా ఫైనల్ మ్యాచ్లో మాత్రం దారుణాతి దారుణంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర ఓటమిపాలైన టీమిండియా ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు.
కేవలం టీమీండియానే కాదు కోట్లాదిమంది ఇండియన్ అభిమానులు సైతం ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు . ఈ క్రమంలోనే పలువురు ఆకతాయిలు సోషల్ మీడియాలో ఇండియా క్రికెటర్స్ ను ట్రోల్ చేస్తూ ఫన్నీగా కొన్ని మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు . అయితే అలాంటి వాటికి ఘాటుగా జవాబు ఇచ్చాడు హీరో నవీన్ పోలిశెట్టి . సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోని షేర్ చేస్తూ అలాంటి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేశారు .
ఈ వీడియోలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ..”అరే వంశీ అదేదో డిప్రెషన్ కోసం టాబ్లెట్ ఉందన్నావు కదా .. టాబ్లెట్ పేరేంట్రా.. నాకోసం కాదురా వేరే ఫ్రెండ్ కోసం ..అయినా నా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుందిగా ..డోలో 650 నా.. అరే నువ్వు నిజంగా ంబ్బ్స్ చదివావా .. లేకపోతే పేమెంట్ సీటా ..”అంటూ ఫన్నీగా మాట్లాడుతూ కనిపిస్తాడు.
ఈ వీడియోకి వరల్డ్ కప్ ఫైనల్ 2023 అంటూ హాష్ ట్యాగ్ కూడా ట్యాగ్ చేశారు . అయితే ఇండియా మ్యాచ్ ఓడిపోయి చాలా రోజులు అవుతున్న ఇంకా అదే పట్టుకొని కొందరు బాధపడుతున్నారు అని .. కావాలనే కొందరు ఇండియా టీం ప్లేయర్ లని ట్రోల్ చేస్తున్నారని.. ఇక మానండిరా బాబు అంటూ పరోక్షంగా చెప్పగానే చెప్పేసాడు నవీన్ పోలిశెట్టి. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!
Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5
— Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023