Moviesచెర్రీ పుట్టినరోజు సందర్భంగా అటువంటి పని చేసిన ఉపాసన.. శభాష్ అంటున్న...

చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అటువంటి పని చేసిన ఉపాసన.. శభాష్ అంటున్న ఫ్యాన్స్..!

మన టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా ఒకరు. వీరిద్దరి అన్యోన్యత చూసి కొందరు అసూయ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక నేడు మెగాస్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉపాసన.. చెర్రీ కోసం ఓ శుభకార్యం చేసింది. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా?.. అది మరేదో కాదు కలకాలం రామ్ చరణ్ ఇలానే సుఖసంతోషాలతో ఉండాలని చెర్రీని తీసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది ఉపాసన.

అంతేకాకుండా కూతురు తరనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులు నిన్న రాత్రి తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయ చేరుకున్న చెర్రీ దంపతులు కుటుంబ సభ్యులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక కొంతకాలంగా గేమ్ చేంజర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న చెర్రీ ప్రస్తుతం తన భార్య కోరిక మేరకు తిరుమలకు చేరుకున్నారు.

ఎంత డబ్బు పలుకుబడి ఉన్నప్పటికీ బర్తడే రోజు పబ్బుకి తీసుకెళ్లకుండా ఉపాసన ఇంచక్కా గుడికి తీసుకెళ్లి తన భర్త క్షేమాలను కోరుకుంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా ఉపాసనాకి ఫిదా అయ్యారు అనే చెప్పుకోవచ్చు. సాధారణంగా బర్తడే అనంగానే పబ్ మరియు ఇతర పార్టీలను అరేంజ్ చేసుకుంటూ లక్షలకు లక్షలు పోస్తూ ఉంటారు. కానీ ఉపాసన మాత్రం తన భర్త బర్తడే రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లి అక్కడ కొంత డబ్బు విరాళం కింద కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా ఉపాసనను శభాష్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news