Movies"కుర్చి మడత పెట్టి" సాంగ్ లో .. పూర్ణ రోల్ ని...

“కుర్చి మడత పెట్టి” సాంగ్ లో .. పూర్ణ రోల్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . అయితే సినిమాలో ఎక్కడా కూడా పెద్దగా స్పెషల్ అపీరియన్స్ లేకపోవడం సినిమాకి అనుకున్నంత స్థాయి కామెంట్స్ దక్కకపోవడంతో సినిమా యావరేజ్ గా నిలిచింది . ఈ సినిమా మొత్తానికి హైలైట్ అయింది కుర్చీ మడత పెట్టి సాంగ్ .

ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజే సంచలనం సృష్టించింది . కాగా ఈ సాంగ్ లో హీరోయిన్ పూర్ణ మనకు స్పెషల్ అపీరియన్స్ ఇస్తుంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ ప్లేస్ లో ముందుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని చూస్ చేసుకున్నారట . కానీ కాజల్ అగర్వాల్ ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆల్రెడీ మహేష్ బాబుతో హీరోయిన్గా చేసి ఇప్పుడు ఆయన సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఆమె మనసు అంగీకరించలేదట . అందుకే ఈ సినిమా ఆఫర్ ను వదులుకునిందట .

ఆ తర్వాత చాలామంది ముద్దుగుమ్మలను ట్రై చేసిన ఫైనల్లి పూర్ణ సెలెక్ట్ అయింది . ఏమాటకామాటే పూర్ణ చించిపడేసింది . బాగా బాగా నటించింది. బాగా బాగా స్టెప్స్ వేసింది . ఈ పాటకు హైలైట్ గా మారింది. థియేటర్స్ లో ఈ పాట వస్తుంటే జనాలు అసలు కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. అంత బాగా కొరియోగ్రఫీ చేశారు. మొత్తంగా సినిమా టాక్ అటు ఇటుగా ఉన్నా పాట మాత్రం బాగానే హిట్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news