Moviesసాయి పల్లవి - బాలయ్య కాంబోలో మిస్సయిన .. ఆ బ్లాక్...

సాయి పల్లవి – బాలయ్య కాంబోలో మిస్సయిన .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి . కానీ అలాంటి కాంబో సెట్ అయితే చూడాలి అన్నది అభిమానుల కోరిక. ఎప్పటినుంచో అలాంటి కాంబో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి కాంబో సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయితే చాలా బాధగా ఉంటుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ లేడి పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలి అంటూ అభిమానులు కోరుకున్నారు .

అనుకున్నట్టే ఒక డైరెక్టర్ అంత పెద్ద సాహసం చేశాడు. కానీ లాస్ట్ మూమెంట్లో సాయి పల్లవి ఈ సినిమాలో రిజెక్ట్ చేసింది. దీంతో ఆ సినిమా వేరే వాళ్లతో తెరకెక్కించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా..? బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన వీర సింహారెడ్డి .

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . ఈ సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ సెలెక్ట్ అయింది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట .కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేసిందట. ఆ తరువాత ఈ పాత్రలో వరలక్ష్మి చించి పడేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news