Newsచనిపోయిన వేణు మాధవ్ గురించి న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌కొచ్చాయ్‌...!

చనిపోయిన వేణు మాధవ్ గురించి న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌కొచ్చాయ్‌…!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా వేణు మాధవ్ ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. మిమిక్రి కళాకారుడిగా కెరీర్ ప్రారంభించి టీడీపీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. మాస్టర్ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ ఆ తర్వాత నటించిన సినిమాలలో తన మేనరిజం తో ఆకట్టుకొని బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు.

సాధారణంగా వేణు మాధవ్ అంటే అందరూ చాలామంచివాడని కితాబిస్తారు. ఉదయభాను లాంటి ప్రముఖ యాంకర్ కం నటి అయితే ఆకాశానికి ఎత్తేస్తుంది. స్టార్ హీరోలు కూడా వేణు మాధవ్ గురించి బాగానే చెప్తారు. కానీ, నటి పద్మ జయంతి అయితే వేణూ మాధవ్ అసలు క్యారెక్టర్ ఏంటో చెప్పి షాకిచ్చింది. వేణు మాధవ్ మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీకి రాకముందు పద్మారావు నగర్ లో ఉండేవాడు.

ఆ సమయంలో వేశాల కోసం ఇండస్ట్రీలో తిరిగేవాడు. అదే సమయంలో పద్మ జయంతి అనే నటి కూడా సినీ అవకాశాల కోసం ప్రయత్నాలలో ఉన్నారు. ఆమె భర్త సాయి కి వేణు మాధవ్ ఫ్రెండ్ అయ్యాడట. ఆ తర్వాత పద్మ ఇంటి నుంచి భోజం రావడం..షూటింగ్స్ కి కేరేజీలు వెళ్ళడం మొదలై దాదాపు నాలుగేళ్ళు సాగిందట.

కానీ, ఏరోజు వేణు మాధవ్ పద్మ జయంతికి అవకాశం ఇప్పించింది లేదని కొన్ని సందర్భాలలో డబ్బులు కూడా సహాయం చేశామని ఆయన మాత్రం మాకు ఎలాంటి సహాయం చేయలేదని కళ్ళు బైర్లు కమ్మే నిజాలని వెళ్లడించింది. ఒకరకంగా మమ్మలిని బాగా వాడుకున్నాడు తప్ప వేణు మాధవ్ బయట చెప్పుకుంటున్నట్టుగా సహాయం చేసే వ్యక్తి కానే కాదని ఓ ఇంటర్వ్యూలో పద్మ జయంతి వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news