Moviesబాల‌య్య‌కు జోడీగా ఇద్ద‌రు ముదురు ముద్దుగుమ్మ‌లు...!

బాల‌య్య‌కు జోడీగా ఇద్ద‌రు ముదురు ముద్దుగుమ్మ‌లు…!

నందమూరి బాలకృష్ణ ఈ యేడాది సంక్రాంతికి వీర‌సింహారెడ్డి, ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రెండు సూప‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నారు. భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత బాల‌య్య‌, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్లాష్‌బ్యాక్‌లో బాల‌య్య‌కు జోడీగా సీనియ‌ర్ హీరోయిన్ త్రిష న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు రాగా.. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని ఆ పాత్ర‌లో సీనియ‌ర్ ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి క‌నిపించ‌బోతోంద‌ని సినిమా మేక‌ర్స్ నుంచి మ్యాట‌ర్ లీక్ అయ్యింది.

దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ప్రియ‌మ‌ణి గ‌తంలో బాల‌య్య‌కు జోడీగా మిత్రుడు సినిమాలో న‌టించింది. ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. అలాగే మ‌రో నంద‌మూరి హీరో ఎన్టీఆర్ య‌మ‌దొంగ సినిమాలోనూ న‌టించింది. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్లు బాగా ఉన్న సినిమా అట‌. అలాగే ఇందులో పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ని చెపుతున్నారు.

ఇక ప్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తుంటే.. రెండో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోంద‌ట‌. ఆమె కూడా ఎన్టీఆర్ ఊస‌ర‌వెల్లి సినిమాలో న‌టించింది. ఏదేమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతుండ‌గా.. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాత నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

అలాగే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజ‌న్య స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదేమైనా ప్రియ‌మ‌ణి, త‌మ‌న్నా బాల‌య్య ప‌క్క‌న అంటే కాంబినేష‌న్ మామూలుగా ఉండ‌దు. ఇక చిరుకు వాల్తేర వీర‌య్య లాంటి బ్లాక్‌బస్ట‌ర్ ఇచ్చిన బాబి బాల‌య్య కోసం ఎలాంటి క్రేజీ ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news