Movies"ప్లీజ్ నన్ను క్షమించు".. స్టార్ హీరోయిన్ కి సారీ చెప్పిన సందీప్...

“ప్లీజ్ నన్ను క్షమించు”.. స్టార్ హీరోయిన్ కి సారీ చెప్పిన సందీప్ రెడ్డి వంగా..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉండే సందీప్ రెడ్డి వంగ.. ఆ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇదే విషయాన్ని ఆయన ఓపెన్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా పేరు గతంలో ఎవరికీ తెలియదు . అర్జున్ రెడ్డి పుణ్యమాంటూ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయిపోయింది. ఓసుకుమార్ ..ఓ రాజమౌళి.. ఓ ప్రశాంత్ నీల్ .. పక్కన ఈయన ఫోటో కూడా పెట్టించుకునేలా చేసాడు .

రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసేసాడు . రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా వచ్చిన యానిమల్ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది. దీనితో సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా సందీప్ రెడ్డివంగా కు మంచి పేరు తీసుకొచ్చింది . అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డివంగా.. హీరోయిన్ పరిణితి చోప్రాను క్షమించమంటూ కోరాను అని చెప్పుకొచ్చాడు .

“నిజానికి ఈ సినిమాలో ఆమెనే నేను హీరోయిన్గా అనుకున్నాను అని ..కానీ పలు కారణాలవల్ల ఆమె ప్లేస్ ను రష్మిక మందన్నాతో రీప్లేస్ చేశానని .. కొన్ని పాత్రలు కొందరికి సెట్ అవ్వవు అలాగే గీతాంజలి పాత్ర పరిమితి చోప్రా కు సెట్ అవ్వదు అని చెప్పానని.. ఈ విషయాన్ని విని ఆమె చాలా అప్ సెట్ అయిందని ..బాధపడిందని తప్పు నాదే కాబట్టి ఆమెకు సారీ నేనే చెప్పానని ..ఆ విషయంలో నాకు ఎలాంటి మొహమాటం లేదని చెప్పుకొచ్చాడు”. దీనితో సందీప్ రెడ్డివంగా సింప్లిసిటీ పై జనాలు ఫిదా అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news