Newsరణబీర్ ప్లేస్ లో ఆ తెలుగు హీరో నటించి ఉంటే.. జనాలు...

రణబీర్ ప్లేస్ లో ఆ తెలుగు హీరో నటించి ఉంటే.. జనాలు చెప్పులు విసిరే వారా..? ఏంటి డైరెక్టర్ ఈ మాటలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు తమ ఒపీనియన్ ని చాలా ఓపెన్ గా బోల్డ్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు . ఒకప్పుడు సినిమా చూసిన జనాలు సినిమా బాగుందా ..? లేదా ..? అని పక్క వాళ్ళతో మాత్రమే చర్చించుకునే వాళ్ళు . కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేస్బుక్ – ఇన్స్టాగ్రామ్-ట్వీట్టర్ లో తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెబుతూ ఆ అభిప్రాయాన్ని పలువురితో షేర్ చేసుకుంటున్నారు .

ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏది అంటే మాత్రం యానిమల్ అని చెప్పాలి .యానిమల్ అనే టైటిల్ ని ఎందుకు చూస్ చేసుకున్నాడో తెలియదు కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ తో పాటు పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇచ్చాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ జనాలు అయితే ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోయిన రేంజ్ లో ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు .

బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసాడు సందీప్ రెడ్డివంగా. నిజానికి ఈ సినిమాను ఓ తెలుగు హీరోతో చేయాలి అని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. కానీ ఆ తెలుగు హీరో ఒప్పుకోలేదు కథ విని నాకు సెట్ అయ్యే సినిమా కాదు అంటూ ఓపెన్ గా చెప్పేసాడట . అయితే ఆ తర్వాత పలువురు హీరోలకు ఈ కథను చెప్పిన తెలుగు హీరోలు సాహసం చేయలేకపోయారు . ఈ సినిమాలో అంత పచ్చిగా బోల్డ్ గా నటించే అంత ధైర్యం మన తెలుగు హీరోలకి ఎవరికీ లేదు .

ఒకవేళ తెగించి ఏ హీరో అయినా సరే సందీప్ రెడ్డి వంగా రాసుకున్న యానిమల్ లోని ఈ పాత్రలో కనిపించి ఉంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ లోని స్క్రీన్స్ లో చెప్పులు కనిపించేవి. అంత బోల్డ్ గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డివంగా , బాలీవుడ్ హీరో కాబట్టి బాలీవుడ్ జనాలు కాబట్టి లైక్ చేస్తున్నారు. తప్పిస్తే రన్బీర్ ప్లేస్ లో ఏ తెలుగు హీరో ఉన్న కచ్చితంగా అక్కడ చెప్పులు పడి ఉండేటివి అంటూ తెలుగు జనాలు చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news