Newsచంద్రమోహన్ తన టోటల్ ఆస్తి ఎవరికి రాసి ఇచ్చారో తెలుసా..? నిజంగా...

చంద్రమోహన్ తన టోటల్ ఆస్తి ఎవరికి రాసి ఇచ్చారో తెలుసా..? నిజంగా మహాను భావుడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రమోహన్ రీసెంట్ గానే అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పలు కీలకపాత్రలో నటించి మెప్పించిన చంద్రమోహన్ .. మన మధ్య లేడు అన్న విషయం జీర్ణించుకోవడం కొంచెం కష్టమే .అయితే ఆయన లేరు అన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు సినిమాల ద్వారా ఆయన గొప్పతనాన్ని చర్చించుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోని చంద్రమోహన్ లో ఉన్న గొప్ప మనసు గురించి కూడా బయటపడింది. సాధారణంగా ఎవరైనా సరే తాము సంపాదించిన ఆస్తిని తమ తథా అనంతరం తమ బిడ్డలకి చెందాలి అని చూస్తూ ఉంటారు .

అయితే చంద్రమోహన్ మాత్రం తాను సంపాదించి కూడ పెట్టిన ఆస్తుల్లో మూడు భాగాలు చేసి రెండు భాగాలను తన ఇద్దరు కూతుర్లకి ఒక భాగాన్ని అనాధ శరణాలయానికి రాసిచ్చారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తను ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా ఇంత గొప్ప మనసు ఉండదని చంద్రమోహన్ కి అలాంటి మనసు ఉందని ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలి అని అభిమానులు ప్రార్థిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news