Newsనాగార్జున- అమల పెళ్లి ఏఎన్నార్‌కు ఇష్టం లేక‌పోయినా ద‌గ్గ‌రుండి చేసింది ఎవ‌రంటే..!

నాగార్జున- అమల పెళ్లి ఏఎన్నార్‌కు ఇష్టం లేక‌పోయినా ద‌గ్గ‌రుండి చేసింది ఎవ‌రంటే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం తర్వాత అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఎంతో గొప్ప స్థానాన్ని తెచ్చిపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తర్వాత తన నట వారసుడుగా ఆయన తనయుడు నాగార్జునను తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. నాగార్జున తన కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎన్నో అపజయాలకు గురయ్యాడు. నాగార్జునకు సినిమాల్లోకి రాకముందే టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మితో పెళ్లి జరిగింది.

పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకు నాగార్జున విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి సినిమాతోనే ఘోరమైన డిజాస్టర్ అందుకున్న నాగార్జున.. తర్వాత గీతాంజలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, శివ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకొని టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సమయంలో నాగార్జునకు మొదటి భార్య లక్ష్మి కి పెళ్లయిన కొన్ని సంవత్సరాలకి వారి మధ్య విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే వారు విడిపోవడానికి ముందే వారికి నాగచైతన్య మొదటి సంతానంగా జన్మించారు.

అలా దగ్గుపాటి లక్ష్మితో విడాకులు తర్వాత నాగార్జున మరో స్టార్ హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు.
వీరిద్దరూ కిరాయి దాదా అనే సినిమాలో కలిసి జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఆ తర్వాత శివ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఈ సినిమాతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో కిరాయి దాదా సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు వీరి పెళ్లిని దగ్గర ఉండి తిరుమలలో జరిపించాడు.

పెళ్లి తర్వాత అమల చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. వీరిద్దరికీ అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్ కూడా టాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఒక సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news