Newsమ‌హేష్ వ‌ర్సెస్ చెర్రీ.. గుంటూరు కారంతో గేమ్ ఛేంజ‌ర్ ఫైట్ ఫిక్స్‌..!

మ‌హేష్ వ‌ర్సెస్ చెర్రీ.. గుంటూరు కారంతో గేమ్ ఛేంజ‌ర్ ఫైట్ ఫిక్స్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటుంది. మీనాక్షి చౌదరి – శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అటు ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా.. షూటింగ్ చాలా ఆలస్యం అవుతుండడంతో వచ్చే ఏడాది చివర్లో కానీ ప్రేక్షకులకు ముందుకు వచ్చేలా కనపడటం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాల ఫ‌స్ట్ సింగిల్‌ టీజర్లు దసరా కానుకగా రిలీజ్ కానున్నాయి. దసరా రోజునే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్… అటు గేమ్ ఛేంజ‌ర్‌ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒకేరోజు మహేష్ – రామ్ చరణ్ సినిమాల ఫ‌స్ట్ సింగిల్స్‌ రిలీజ్ అయితే సోషల్ మీడియాలో ఎవరి టీజర్ కు ఎక్కువ ? క్రేజ్ ఉంటుంది ఏ టీజర్ కు ఎక్కువ ? వ్యూస్ వస్తాయి అన్న పోటీ సహజంగానే ఉంటుంది.

అభిమానులు కూడా తమ హీరో టీజర్ పై చేయి సాధించింది అంటూ నానా హంగామా చేస్తారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో మహేష్ – రామ్ చరణ్‌ల‌లో ఎవరు ? పై చేయి సాధిస్తారో చూడాలి. ఎప్పటికే అభిమానులు మాత్రం తమ హీరోల ఫ‌స్ట్ సింగిల్‌ టీజర్ల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news