Newsబాలయ్య-పూజా హెగ్డే కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే.. డైరెక్టర్ కి...

బాలయ్య-పూజా హెగ్డే కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే.. డైరెక్టర్ కి దండ వేసి దండం పెట్టాల్సిందే..!!

కొన్ని కొన్ని సార్లు కొన్ని కాంబోలో మిస్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాం. అబ్బబ్బా .. ఈ కాంబో సెట్ అవ్వలేదు అంటూ చాలాసార్లు అనుకుంటాం . అయితే చాలా రేర్ సందర్భంగా మాత్రమే హమ్మయ్య .. ఈ కాంబో సెట్ అవ్వలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటి ఓ కాంబో నే బాలయ్య – పూజా హెగ్డే .

పూజ హెగ్డే బాలయ్య కాంబోలో ఓ సినిమా తెరకెక్కాల్సింది. కానీ మిస్ అయ్యింది. ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ నటించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ – హనీ రోజ్ నటించారు .

అయితే గోపి ముందుగా ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర కోసం పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నారట . కానీ ఆమె ఈ రోల్ యాక్సెప్ట్ చేయలేదట . అంత పెద్ద హీరో సరసన నటిస్తే తనకు మళ్ళీ హీరోయిన్గా ఆఫర్లు రావు ఏమో అన్న భయంతో ఆమె ఈ రోల్ ని రిజెక్ట్ చేసిందట . అయితే బాలయ్య ఫ్యాన్స్ ఆమె కన్నా ముందే ఈరోల్ ఆమె చేయకపోవడం మంచిది అన్న కామెంట్స్ చేశారు. అంతే కాదు మా బాలయ్య పక్కన ఆ పూజ హెగ్డే కి నటించే అర్హత లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేశారు . దీంతో ఇదే న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news