Newsప్ర‌భాస్‌కు ఘోర అవ‌మానం... ఇంత క‌న్నా దారుణం ఉంటుందా...!

ప్ర‌భాస్‌కు ఘోర అవ‌మానం… ఇంత క‌న్నా దారుణం ఉంటుందా…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా.. సెన్సేషనల్ మోస్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ స‌లార్‌. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు స‌లార్ మంత్‌ మొదలు కావడంతో ఈ భారీ సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా అభిమానులు అందరూ ఎంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

అయితే పెద్ద షాకింగ్ న్యూస్ తో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి వెళ్ళిపోయారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. అయితే యూఎస్ లో ఇదివరకే బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఏ ఇండియన్ సినిమాకు రాని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడటం దాదాపు ఖరారు కావడంతో అక్కడ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది.

ఇది నిజంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు దారుణ‌ అవమానం లాంటిదే. ఓవైపు సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దాదాపు నెల రోజుల ముందే మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలాంటి టైంలో సినిమా వాయిదా పడటం.. డబ్బులు వెనక్కి ఇవ్వటం అంటే ఇంతకన్నా దారుణం ఉండదనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news