Movies"వాళ్లంత రాక్షసులే"..సంచలన వీడియోని షేర్ చేసిన రష్మి(వీడియో)..!!

“వాళ్లంత రాక్షసులే”..సంచలన వీడియోని షేర్ చేసిన రష్మి(వీడియో)..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన షూట్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూనే మరోవైపు ఆమె సమాజంలో జరిగే అరాచకాల గురించి కూడా బయటపడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రష్మి అనిమల్ లవర్ అన్న సంగతి తెలిసిందే. మూగజీవాలను ఎవరైనా టార్చర్ చేస్తే చీల్చి చండాడేస్తుంది .

కాగ మూగజీవాలను ఏ రూపంలో అన్యాయం జరిగిన సహించలేదు . ఇప్పటివరకు ఆమె ఎన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా మూగజీవాలను హింసించే వారిని నిందించిన తెలిసింది మంకు తెలిసందే. రీసెంట్ గా రష్మి గౌతమ్ ఓ సంచలన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది . తాజాగా పదుల సంఖ్యలో తిమింగలాలను సంహరిస్తున్న వీడియో ఆమె ట్విట్ చేశారు.

ఆ వీడియోలో అత్యంత దారుణంగా తిమింగలాల రక్తంతో సాగర తీరం ఎర్రగా మారిపోయింది. ఆ వీడియోలో తిమింగలాలను చంపుతున్న వ్యక్తులను ఉద్దేశిస్తూ రష్మి షాకింగ్ పోస్ట్ పెట్టింది . “రాక్షసులు అక్కడో ఇక్కడో ఎక్కడో లేరు ..ఇలాంటి వాళ్ళ రూపంలో మనతోనే మన చుట్టూ ఉంటారు “అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది. దీనితో రష్మీ ట్వీట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news