Movies"అలా జరిగి సరిగ్గా ఈరోజు కి ఏడాది"..ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సాయిపల్లవి..!!

“అలా జరిగి సరిగ్గా ఈరోజు కి ఏడాది”..ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సాయిపల్లవి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న హీరోయిన్ సాయి పల్లకి ఉన్న ఇమేజ్ గురించి ..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్ళే అవుతున్న ఇప్పటికీ చెక్కుచెదరని ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . అంతేకాదు రొమాంటిక్ సీన్స్ లో అభ్యంతర సన్నివేశాలల్లో నటించను అంటూ తగేసి చెప్పే సాయి పల్లవి ..కోట్లు ఆఫర్ ఇచ్చినా సరే ..పాత్ర ఇష్టం లేకపోతే కన్నెత్తి కూడా చూడదు.

అంతటి కమిట్మెంట్ గల వ్యక్తి సాయి పల్లవి . కాగా సాయి పల్లవి రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది . తన లైఫ్ లో మర్చిపోలేని ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . జూన్ 17న ఆమె నటించిన విరాటపర్వం సినిమా రిలీజై ఏడాది కావస్తున్న క్రమంలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకోచ్చింది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా 17 జూన్ 2022లో విడుదలైంది .

కాగా రానా మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమాలో ప్రియమణి- నవీన్ చంద్ర- నివేత పేతురాజు కీలక పాత్ర పోషించారు . ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా హిట్టు కాకపోయినా నటనపరంగా సాయి పల్లవికి మంచి మార్కులు వేయించింది . ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియా ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసుకొచ్చింది . “విరాటపర్వం విడుదల అయ్యి ఈరోజుతో ఏడాది పూర్తయింది . వీరాటపర్వానికి ముందు నేను ..దాన్ని విడుదల తర్వాత నేను.. ఒకటి మాత్రం కాదు ..విరాటపర్వం అందమైన అనుభూతిని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని ప్రేమను ఇచ్చింది ” అంటూ ఎమోషనల్ గా రాసుకోచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news