Moviesబిగ్‌బ్రేకింగ్‌: అగ్ర సినిమాల నిర్మాత మృతి… తీవ్ర విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ

బిగ్‌బ్రేకింగ్‌: అగ్ర సినిమాల నిర్మాత మృతి… తీవ్ర విషాదంలో సినిమా ఇండ‌స్ట్రీ

సినిమా పరిశ్రమలో గత కొద్ది రోజులుగా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. నెలల వ్య‌వ‌ధిలోనే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. సీనియర్ హీరోలు.. సీనియర్ హీరోయిన్లు.. అలాగే సినిమా రంగానికి చెందిన ఇతర సీనియర్ ఆర్టిస్టులతో పాటు చాలామంది మృతి చెందుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్ఎస్ చక్రవర్తి ( 53 ) మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం శ్వాస విడిచారు. చక్రవర్తికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన తనయుడు జానీ రేణిగుంట అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఇక చక్రవర్తి విషయానికి వస్తే 1997లో రాశి అనే సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో అజిత్ కుమార్ తో వాలి – రెడ్ – సిటిజెన్ – మగవారే – ఆంజనేయ అనే సినిమాలు తెరకెక్కించారు. చక్రవర్తి తన కెరీర్‌లో ఎక్కువ సినిమాలు అజిత్తోనే నిర్మించడం విశేషం.

అలాగే కోలీవుడ్ యంగ్ హీరో శింబు హీరోగా నటించిన కాలై, వాలు సినిమాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాత చక్రవర్తి మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news