Moviesబిగ్ బ్రేకింగ్‌: సోనియా - షోయ‌బ్ విడాకుల‌పై క్లారిటీ..!

బిగ్ బ్రేకింగ్‌: సోనియా – షోయ‌బ్ విడాకుల‌పై క్లారిటీ..!

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా – పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి ఒక సంచలనం. వీరిద్దరి పెళ్లి 2010లో హైదరాబాదులో వైభవంగా జరిగింది. భారత్ – పాకిస్తాన్ అంటే ఎంత శత్రుత్వ దేశాలుగా ఉంటాయో తెలిసిందే. అలాంటిది ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులుగా ఉన్న సానియా, షోయ‌బ్‌ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం అయింది. వీరిద్దరిది ముందుగా పెద్దల కుదిర్చిన వివాహం. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి పెళ్లి జరిగి 12 సంవత్సరాలు అయ్యింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు

గత కొంతకాలంగా షోయబ్‌, సానియా ఇద్దరు వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. గత ఏడాదికాలంగా ఈ దంపతులు విడిపోతున్నారని.. త్వరలో విడాకులు కూడా వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పదే పదే ప్రచారంలో ఉన్నా… అటు సానియా, ఇటు షోయబ్ ఇద్దరిలో ఎవరు ఖండించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండగా సానియా గత నాలుగైదేళ్లుగా అత్తారింట్లో అడుగు పెట్ట‌లేదు. రెండేళ్ల‌ క్రితం వరకు షోయబ్ కూడా ప్రొఫెషనల్ క్రీడాకారుడు కావడంతో… క్రికెట్ ఆటలో బాగా బిజీగా ఉన్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా సానియా పాకిస్తాన్లోని అత్తారింటికి వెళ్లడం లేదు.

తాజాగా సానియా ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికేసింది. హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ ఆడేసింది. తన చివరి మ్యాచ్ అనంతరం సానియా గౌరవార్థం ఓ ప్రైవేట్ హోటల్లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు.. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లు మహమ్మద్ అజారుద్దీన్, యువరాజు సింగ్ – స్టార్ హీరోలు మహేష్ బాబు – దుల్కర్ సల్మాన్ – ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లాంటివాళ్ళు కూడా ఆమెకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో సానియా భర్త షోయబ్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. షోయబ్‌ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అవేమీ అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా కాదు. తన భార్య ఆఖరి మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ రావచ్చు. కానీ అలా రాలేదు. ఒకవేళ షోయబ్ రావడానికి కుదరకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అయినా వీడ్కోలు సందేశం పెట్టవచ్చు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా ఉండే షోయ‌బ్‌.. తన భార్య రిటైర్మెంట్ విషయాన్ని పట్టించుకోలేదు.

దీంతో మరోసారి వీరిద్దరు విడాకుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇప్పటికే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని.. అందుకే ఫేర్వెల్ పలికేందుకు మ‌నోడు రాలేదని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక వీరిద్దరి మధ్య విడాకులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ విడాకుల ప్రచారంపై ఈ భార్యాభర్తల స్పందిస్తారా ? లేదా త్వరలో ఎవరిదరు వారు చూసుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక సానియా నాలుగైదు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ క్రేజీ హీరోతో ఎఫైర్ నడుపుతుంద‌న్న రూమ‌ర్లు వచ్చాయి. కారణం ఏదైనా అప్పటినుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news