MoviesTrivikram టాలీవుడ్‌లో త్రివిక్ర‌మ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది… బుర్రా గ‌రం గ‌రం…!

Trivikram టాలీవుడ్‌లో త్రివిక్ర‌మ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది… బుర్రా గ‌రం గ‌రం…!

టాలీవుడ్ లో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాధితుల సంఖ్య రోజుకు పెరిగిపోతుందన్న చర్చలు, గుసగుసలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ డైరెక్షన్ పై అంతగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదని… ఎక్కువగా నిర్మాణ వ్యవహారాలతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. హారిక హాసిని బ్యాన‌ర్‌కు తెరవెనక త్రివిక్రమ్ అంతా తానై నడిపిస్తాడు అన్నది చాలావరకు జగమెరిగిన సత్యం. అలాగే సితార బ్యానర్ నిర్మాణ వ్యవహారాల్లోనూ త్రివిక్రమ్ పాత్ర ఎక్కువగా ఉందనే అందరూ అంటూ ఉంటారు.

దీనికి తోడు పవన్ కళ్యాణ్ నటించే సినిమాల కథనాల ఎంపికతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగుల విషయంలోనూ త్రివిక్రమ్ కాళ్లు వెళ్ళు పెట్టేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ మొత్తం తానై వ్యవహరించారు. ఈ సినిమాకు స్క్రీన్ పై మాటలు అందించినందుకు గాను త్రివిక్రమ్‌కు ఏకంగా రు. 10 కోట్ల రెమ్యూనరేషన్ ముట్టిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తమిళ రీమేక్‌ సినిమాకు కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారట.

ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్‌కు భారీగా రెమ్యూనరేషన్ ముట్టినట్టు తెలుస్తోంది. ప‌వ‌న్‌ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న దర్శకులతో పాటు ఇతరులు ఎవరికి పేరు రావటం లేదన్న అసంతృప్తి చాలామందిలో ఉంది. తాజాగా పవన్ సాయి తేజ రీమిక్స్ సినిమాకు బుర్ర సాయి మాధవ్‌ను ముందుగా రైటర్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఎక్కువ టైం తీసుకునే బుర్రా తన వెర్షన్ ఇచ్చారట. అయితే ఆ వెర్ష‌న్‌ తనకు నచ్చలేదని.. త్రివిక్రమ్ ఆయనకు కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసి ప్రాజెక్టు నుంచి బయటకు పంపేశారట.

త్రివిక్రమ్ కావాలనే బుర్ర రాసిన వెర్ష‌న్ బాగోలేదని.. ఆయనకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేయించారని అంటున్నారు. అయితే స్క్రీన్ ప్లే, మాటలు మార్పులు.. చేర్పులు విషయంలో అన్నింటా తెరమీద తన పేరే ఉండాలన్న ఆలోచనతో త్రివిక్రమ్ ఇలా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక స్టార్ రైటర్ విషయంలోనే త్రివిక్రమ్ ఇలా వ్యవహరించడం చాలామందికి మింగుడు పడటం లేదు. దర్శకుడుగా త్రివిక్రమ్ కు మంచి పేరు ఉంది. అలవైకుంఠపురంలో సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది.

ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా కంటే కూడా పవన్ రీమేక్‌ సినిమా మీదే త్రివిక్రమ్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని.. ఈ వ్యాపారం ఏదో బాగుందన్న ఆలోచనతోనే త్రివిక్రమ్ ఇలా పవన్ సినిమాలకు తెరవెనక అంతా నడిపిస్తున్నారని అంటున్నారు. దీంతో మ‌హేష్ సైతం త్రివిక్ర‌మ్ మీద ర‌గిలిపోతున్నాడ‌ట‌. ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బుర్రా కూడా త‌న‌కు జ‌రిగిన అవ‌మానంగా ఫీల్ అవుతున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. ఏదేమైనా త్రివిక్ర‌మ్ క‌ష్ట‌ప‌డుతోన్న ఎవ్వ‌రికి పేరు రాకుండా ఇలా కూడా చ‌క్రాలు తిప్పుతున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news