Moviesదివాళి రోజున గుడ్ న్యూస్ చెప్పిన ప్రియమణి..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

దివాళి రోజున గుడ్ న్యూస్ చెప్పిన ప్రియమణి..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

పండగ రోజు మరో తిపి కబురు అందించింది హాట్ బ్యూటీ హీరోయిన్ ప్రియమణి . ఎస్ పండగ పూట తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చేసింది అందాల ముద్దుగుమ్మ ప్రియమణీ. మనకు తెలిసిందే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రియమణి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి . దానికి మెయిన్ రీజన్ వీళ్లిద్దరూ దూరంగా ఉండటమే.

ప్రియమణి ఇండియాలో ఉంది. తన భర్త అమెరికాలో ఉంటున్నారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరికి సంబంధించిన ఏ న్యూస్ అభిమానులతో పంచుకోవట్లేదు ప్రియమణీ. అంతేకాదు కొటేషన్స్ పెడుతుందే కానీ భర్తకు సంబంధించిన ఏ విషయం చెప్పకపోవడంతో త్వరలోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ న్యూస్ వినిపించింది. ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ బాధపడిపోయారు.

దీంతో పండగ పూట ఒక్క పోస్ట్ తో అసలు విషయం చెప్పేసింది.” నా నుండి నా ఫ్యామిలీ నుండి మీకు దీపావళి శుభాకాంక్షలు “అంటూ చెప్పుకు వచ్చింది. అంతే కాదు క్రింద మిస్ యు ముస్తఫా అంటూ కోట్ చేసి..ఓ లవ్ సింబల్ పెట్టింది . దీంతో విడాకుల వార్తలు ఫేక్ అంటూ చెప్పకనే చెప్పేసింది. కాగా ప్రజెంట్ ప్రియమణి వరుస సినిమాలతో బిజీగా ఉంది. దీంతో దీవాలి రోజున తన భర్తకు సంబంధించిన పేరును చెప్పి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news