Moviesహమ్మయ్య..బిగ్ రిలీఫ్..కవల పిల్లలు పుట్టింది వాళ్లకే..తేల్చేసిన కోర్ట్..!?

హమ్మయ్య..బిగ్ రిలీఫ్..కవల పిల్లలు పుట్టింది వాళ్లకే..తేల్చేసిన కోర్ట్..!?

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నయనతార విగ్నేశ్ శివన్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళు ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నారు. మొదట పెళ్లికి సంబంధించిన హాట్ ఫోటోషూట్ ఓ రీజన్ అయితే.. ఆ తర్వాత తిరుమల లో చెప్పులు వేసుకొని తిరగడం అభిమానులను హర్ట్ చేసింది.

తన మ్యారేజ్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఏకంగా ఐదు కోట్లు నష్టపోయినట్లు వార్తలు వినిపించాయి .ఆ తర్వాత ఎట్టకేలకు నయనతార నెట్ ఫిక్స్ వాళ్లతో మాట్లాడి తన కాంట్రాక్ట్ కంటిన్యూ చేసింది. కాగా రీసెంట్ గా కవల పిల్లలు జన్మించారు అంటూ విగ్నేశ్ శివన్ పెట్టిన పోస్ట్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో తెలిసిందే. నాలుగు నెలలకి కవల పిల్లలు అంటూ విగ్నేష్ పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియా షేక్ అయింది, అంతేకాదు ఇదంతా సరోగసి ప్రాసెస్ కారణంగానే జరిగింది అంటూ తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది .

ఎందుకంటే సరోగసి ఇండియాలో బ్యాన్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి పేపర్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే నయన్ విగ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష కన్ ఫామ్ అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే వాటిని చాకచక్యంగా తప్పించుకునింది ఈ జంట . వీళ్ళ సరోగసి ప్రాసెస్ కి వెళ్ళిన మాట నిజమే . కానీ అది ఇండియాలో కాదు దుబాయ్ లో అంటూ తేల్చి చెప్పింది ఈ జంట . దీంతో తమిళనాడు ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది .

కాగా ఇన్నాళ్లు చిక్కుముడుల్లో ఇబ్బందులు పడిన నయనతార విగ్నేశ్.. రీసెంట్గా దివాళికి అన్ని క్లియర్ అవ్వడంతో తన ఇద్దరు పిల్లలతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు . దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ” మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు” అంటూ చెప్పడం హ్యాపీగా అనిపించింది. అంతేకాదు వాళ్లని ఇలా పిల్లలతో కలిసి చూసిన ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .ఏది ఏమైనా సరే ఇకనుంచి అయినా ఈ జంట అన్ని సవ్యంగా జరిగేలా చూసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news