Moviesఆ పిల్లలు వాళ్లకే పుట్టారు..సరోగసి వివాదంలో బిగ్ ట్వీస్ట్.. నయన్-విగ్నేశ్ సేఫ్..!?

ఆ పిల్లలు వాళ్లకే పుట్టారు..సరోగసి వివాదంలో బిగ్ ట్వీస్ట్.. నయన్-విగ్నేశ్ సేఫ్..!?

ఏంటో హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో ఊహించిన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు నయనతార అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మనకి తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే ఇతని పెళ్లి చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో తెలియదు కానీ అప్పటినుంచి నయనతార పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక కారణంగా ట్రోల్ అవుతూనే ఉంది. పెళ్లి టైం లో వీళ్ళ ఫొటోస్ ఓ రేంజ్ లో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత తిరుమల కు వెళ్లి అక్కడ నయనతార చెప్పులు వేసుకోవడం ఒక సంచలనంగా మారింది . ఆఖరికి నయనతార-విగ్నేశ్ క్షమాపణలు చెబుతున్నాము అంటూ అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ వీళ్ళ పెళ్లికి సంబంధించిన పూర్తి అఫీషియల్ రైట్స్ తీసుకొని కోట్లల్లో డబ్బు ముట్ట చెప్పిందని ..అయినా కానీ విగ్నేశ్ వాళ్ళ పెళ్లి ఫోటోలను పర్మిషన్ లేకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ..ఈ కారణంగా నెట్ ఫ్లిక్స్ వాళ్లపై పోలీస్ కేసుకి సిద్ధమైంది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది. దీంతో మళ్లీ నయనతార పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు సరోగసి ప్రాసెస్ ద్వారా కవల పిల్లలను కన్నారు అంటూ ఓ న్యూస్ సంచలనంగా మారింది.

ఇండియాలో సరోగసి బ్యాన్ అయ్యింది. అయిన వాళ్లు ఎలా ఈ ప్రాసెస్ ను ఇంప్లిమెంట్ చేశారు అని కోలీవుడ్ మీడియా ఫైర్ అవుతుంది . ఈ క్రమంలోనే తమిళనాడు గవర్నమెంట్ నయనతార విగ్నేష్ పై స్పెషల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడింది . ఈ క్రమంలో నయన్ విగ్నేష్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బిగ్ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చారు. వాళ్లకు ఆరేళ్ల క్రితం పెళ్లి అయ్యిన్నట్లు రిజిస్టర్ మ్యారేజ్ కు సంబంధించిన సర్టిఫికెట్ ని తమిళనాడు గవర్నమెంట్ కు ప్రొడ్యూస్ చేసినట్లు తెలుస్తుంది.

మనకు తెలిసిందే సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే పెళ్లి ఆయి ఐదేళ్ళు అయ్యి ఉండాలి. ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం కలిగి ఉండాలి .అప్పుడే సరోగసిని లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు . కాగా ఈ లీగల్ పాయింట్ పట్టుకున్న నయనతార విగ్నేశ్..మాకు ఆరేళ్ల ముందే పెళ్లి అయ్యిందంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ ను తమిళనాడు గవర్నమెంట్ కి అందజేశారు. అంతేకాదు నయనతార కి ప్రాబ్లం ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు . ఒక్కవేళ ఇదే నిజం అయితే..నయనతార విగ్నేష్ ఈ సమస్య నుండి బయటపడిన్నట్లే.. ఆ కవల పిల్లలు వాళ్లకే సొంతం అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news