Moviesసౌందర్య కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. లేకపోతే హ్యాపీగా...

సౌందర్య కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. లేకపోతే హ్యాపీగా ఉండేదిగా..!?

సౌందర్య.. ఈ పేరు చెప్తే ఇప్పటికి జనాలు ఆమె గురించి మాట్లాడకుండా ఉండలేరు. అలాంటి ఓ చెరగని స్థాయిని సంపాదించుకుంది ఈ నటి .సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సావిత్రి అంటే ఎంత ఫేమస్ అంత అభిమానం దక్కించుకుందో.. ఆ తర్వాత ఆమెలా అంతటి పేరు దక్కించుకున్న ఏకైక నటి సౌందర్యానే అని చెప్పాలి . ఎక్సపోజింగ్ కి దూరంగా నటనకు దగ్గరగా ఎటువంటి పాత్రనైనా సరే తన బాడీని మలుచుకొని తెరపై ఆమె నటిస్తూ జనాలను నవ్విస్తూ సినీ ఇండస్ట్రీని ఊపేసింది. అంతేకాదు ఆ టైంలో ఇండస్ట్రీలో ఏక చక్రాధిపతిగా రాజ్యమేలింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో సినిమాలు చేస్తూ సౌందర్య బాగా ఫేమస్ అయింది. మరి ముఖ్యంగా తెలుగులో చిరంజీవి ,నాగార్జున ,వెంకటేష్ లతో ఎక్కువ సినిమాలు చేసి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది . కాగా ఆమె కెరియర్ మంచిగా కొనసాగుతున్నప్పుడే ఫ్లైట్ యాక్సిడెంట్లు మరణించింది. దీంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సౌందర్య లాంటి నటి ఇప్పటికీ ఇండస్ట్రీలో రాలేదని చెప్పాలి


సినీ పరంగా సౌందర్య ఎంత మంచి పేరు సంపాదించుకుందో.. వ్యక్తిగతంగా సౌందర్య అంతే విమర్శల పాలైంది. దానికి కారణం ఆమె తన ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండానే తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. నిజానికి సౌందర్య అంటే చాలా పద్ధతిగా సైలెంట్ గా ఉంటుంది చెప్పిన మాట వింటుంది అనే పేరు ఉంది.

కానీ అన్ని విషయాల్లోను అమ్మ మాట విన్న సౌందర్య కేవలం.. పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రులు మాట వినలేదు. జి.ఎస్ రఘు అనే అతను ప్రేమించి పెళ్లి చేసుకుంది .అయితే నిజానికి వీళ్ళిద్దరి జాతకంలో దోషం ఉన్నట్లు.. వీరిద్దరి జాతకాలు మ్యాచ్ అవ్వవని ముందే చెప్పారట. కానీ ప్రేమ అనే మత్తులో సౌందర్య ఆ జాతకాలను పక్కన పెట్టేసి రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నింది. అయితే ఊహించిన విధంగా సౌందర్య పెళ్లయిన కొంతకాలానికి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news