Moviesకృష్ణం రాజు కోసం ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..దండం పెడుతున్న ఫ్యాన్స్..!!

కృష్ణం రాజు కోసం ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..దండం పెడుతున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణమరాజు అనారోగ్య కారణంగా ఈ నెల 11న హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు ,రాజకీయ నాయకులు సన్నిహితులు రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతోమంది కృంగిపోయారు. ఆయన కడసారి చూపు కోసం వేలాది మంది తరలివచ్చి ఆయనను చివరిసారిగా చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కృష్ణంరాజు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇంకా ఆ విషాదఛాయల నుండి రెబల్ ఫ్యామిలీ బయటకు రాలేకపోతోంది.

మరీ ముఖ్యంగా ప్రభాస్ ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదు . సినిమా ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడతారని షూటింగ్ కి వెళ్లిన ప్రభాస్ మాత్రం ఇంకా పెదనాన్న మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఘనంగా నిర్వహించనున్నారు రెబెల్ ఫ్యామిలీ. ఈ సందర్భంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సలార్ సినిమా షూటింగ్ వారం రోజుల ఆపేసి ఆయన స్వస్థలానికి మొగల్తూరు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణం రాజు సంస్మరణ సభలకు రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సినీ విశ్లేషకులు అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో హై సెక్యూరిటీ మధ్య ఈ సంస్మరణ సభ జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా భారీగా తరలివస్తున్న జనాల కోసం రెబెల్ ఫ్యామిలీ మొగల్తూరులోని 10 ఎకరాల మామిడి తోటలో దాదాపు 90000 మందికి సరిపడా వ్జ్- నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేస్తున్నారట రెబెల్ ఫ్యామిలీ. మనకు తెలిసిందే కృష్ణంరాజుకు ప్రభాస్ కు ఓ అలవాటు ఉంది.

ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టి పంపిచడం. ఆశ్చర్యం ఏంటంటే ప్రభాస్ తన సొంత ఖర్చులతో ఈ పనులన్నీ జరిపిస్తున్నారట. కృష్ణం రాజు సంపాదించిన ఒక్క రూపాయి కూడా ప్రభాస్ ముట్టుకోవట్లేదని పెదనాన్న రుణం తీర్చుకునే అవకాశం ఇది అంటూ ప్రతిదానికి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బునే ఖర్చు చేస్తున్నారట . ఇక కృష్ణంరాజు సంస్మరణ సభకు మీడియాకు అనుమతి లేదని ముందే రెబెల్ ఫ్యామిలీ చెప్పారట. ఆ ప్రోగ్రాం ఫీడ్ వీడియో ఫోటోలు వాళ్లు రికార్డు చేసి ఇవ్వనట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news