Moviesపూరి జ‌గ‌న్నాథ్ - లావ‌ణ్య‌ను ఎందుకు లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు... ఏం...

పూరి జ‌గ‌న్నాథ్ – లావ‌ణ్య‌ను ఎందుకు లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ క్రేజ్ వేరు. పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్‌లు వ‌చ్చినా.. అదే క్రేజ్ ఉంటుంది.. ప్లాప్‌లు వ‌చ్చినా అదే క్రేజ్ ఉంటుంది. ఎన్ని ప్లాప్‌లు వ‌చ్చినా ఒక హిట్‌తో పూరీ తానేంటో ప్రూవ్ చేసుకుంటాడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి సూప‌ర్ హిట్‌లు కొట్టాడు. పూరీ మేకింగ్‌ను చాలా మంది ఇష్టప‌డుతు ఉంటారు. రెండు ద‌శాబ్దాల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాన్ హీరోగా వ‌చ్చిన బ‌ద్రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా మ‌రిన పూరి ఈ 20 ఏళ్ల‌లో 35కు పైగా సినిమ‌లు చేశారు. పూరీ డైరెక్ట‌ర్ కావ‌టానికి ముందు దూర‌ద‌ర్శ‌న్‌లో సీరియ‌ల్స్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు.

ఈ స‌మ‌యంలోనే తాను అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఓ రోజు షూటింగ్‌లో లావ‌ణ్య‌ను చూసి ఇష్ట‌ప‌డి పెళ్ళి చేసుకున్నారు. పూరీ – లావ‌ణ్య‌ను చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోవ‌డం.. వెంట‌నే లావ‌ణ్య కూడా పూరీకి ఐల‌వ్‌యు చెప్ప‌టం అన్నీ చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. అంబ‌ర్‌పేట శంక‌ర్ అన్న పూరీ- లావ‌ణ్య పెళ్లికి స‌హ‌యం చేశాడ‌ని అంటారు. పూరీ భార్య శంక‌ర్‌కు ద‌గ్గ‌రి బంధువు అని అట‌.

పూరీ డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి ముందు.. ప్ర‌ముఖ‌ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ ఇంటిలోనే కింద గ‌దిలో అద్దెకు ఉండేవాడ‌ట. ఆ ఇళ్లు స‌న‌త్‌న‌గ‌ర్లో ఉంది. అక్క‌డే పూరి త‌న గ్యాంగ్‌తో రోజూ క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొనేవాడ‌ట‌.
పూరీ లావ‌ణ్య పెళ్లికి.. లావ‌ణ్య ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో పూరి లావ‌ణ్య‌ను లేపుకొచ్చి మ‌రి పెళ్లి చేసుకున్నాడ‌ని కూడా హేమ చెప్పింది. అప్పుడు లావ‌ణ్య కూడా త‌న ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అప్పుడు అంబ‌ర్‌పేట శంక‌ర్‌తో పాటు హేమ‌, ఝాన్సీ, కృష్ణ‌వంశీ, కొంద‌రు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల సాయంతో పూరి, లావ‌ణ్య‌ను పెళ్లి చేసుకున్నాడ‌ట‌.

పెళ్లైన‌ప్పుడు కెరీర్ స్టార్టింగ్‌లో పూరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు అయితే బద్రి సినిమాతో ఏకంగా తొలి సినిమాతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చిందో ? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యిందో అప్ప‌టి నుంచి పూరీ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా దూసుకుపోయాడు.
మ‌ధ్య‌లో కొన్ని ప్లాపుల‌తో పూరీ ఇబ్బందులు ఎదుర్కొన్నా.. త‌ర్వాత గోడ‌కు కొట్టిన బంతిలా దూసుకురావ‌డం పూరీకే చెల్లింద‌ని చెప్పాలి.

పూరీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కించిన లైగ‌ర్ ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ త‌ర్వాత పూరి, విజ‌య్‌తోనే జ‌న‌గ‌ణ‌మ‌న అనే మ‌రో పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. ఇక పూరీ కుమారుడు ఆకాశ్ పూరి కూడా హీరో అయిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రింద‌టే ఆకాశ్ చోర్‌బ‌జార్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news